...
...
Next Story

SCR Special Trains : పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు - లిస్టులో తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్..! పూర్తి షెడ్యూల్ ఇదే!

SCR Summer Special Trains : వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, హైదరాబాద్, నాందేడ్ వంటి కీలక నగరాల మధ్య నడిచే పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Published on: Apr 30, 2026, 15:35:44 IST
Advertisement

SCR Summer Special Trains : వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

పలు ప్రత్యేక రైళ్లు పొడిగింపు
పలు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుచానూరు, తిరుపతికి వెళ్లే భక్తుల కోసం, అలాగే హైదరాబాద్, బెళగావి, నాందేడ్ వంటి ప్రముఖ నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. మే మొదటి, రెండో వారాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.

పొడిగించిన రైళ్ల వివరాలు:

తిరుచానూరు - నాందేడ్ - జాల్నా రూట్: మహారాష్ట్ర నుంచి తిరుచానూరు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రైలు సంఖ్య 07015 (హెచ్.ఎస్. నాందేడ్ - తిరుచానూరు) మే 2న (శనివారం) నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 07016 (తిరుచానూరు - హెచ్.ఎస్. నాందేడ్) మే 3న (ఆదివారం) అందుబాటులో ఉంటుంది.

  • జాల్నా - తిరుచానూరు (07609) మధ్య మే 4వ తేదీతో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో (07610) మే 5వ తేదీన మరో ట్రైన్ నడుస్తుంది.
  • తిరుపతి - పండరీపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైలు సంఖ్య 07012 (తిరుపతి - పండరీపూర్) మే 9న (శనివారం) ఒక ట్రిప్పు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 07032 (పండరీపూర్ - తిరుపతి) మే 10న (ఆదివారం) అందుబాటులో ఉంటుంది.
  • హైదరాబాద్ - బెళగావి మధ్య ప్రత్యేక రైళ్లుంటాయి. రైలు సంఖ్య 07043 (హైదరాబాద్ డెక్కన్ - బెళగావి) మే 7న (గురువారం) బయలుదేరుతుంది. రైలు సంఖ్య 07044 (బెళగావి - హైదరాబాద్ డెక్కన్) మే 8న (శుక్రవారం) తిరుగు ప్రయాణం అవుతుంది.
  • నాందేడ్ - ధర్మవరం మధ్య నడిచే 07189/07190 రైళ్లను కూడా మే 8, మే 10 తేదీల్లో ఒక ట్రిప్పు పాటు పొడిగించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe