Tirupati - Chhapra Special Trains : వేసవి ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. తిరుపతి నుంచి బీహార్లోని ఛప్రా జంక్షన్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ వేసవిలో సొంతూళ్లకు వెళ్లేవారికి… పర్యాటకులకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం.
- దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. తిరుపతి నుంచి ( ట్రైన్ నెంబర్ 07443) ఛప్రా జంక్షన్ కు మే 7వ తేదీన 23:55 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. ఈ రైలు…. ఆదివారం ఉదయం 07:45 గంటలకు ఛప్రా జంక్షన్ కు చేరుతుంది.
- ఇక ఛప్రా జంక్షన్ (ట్రైన్ నెంబర్ 07444) నుంచి తిరుపతికి మే 12వ తేదీన ఉదయం 5 గంటలకు ట్రైన్ ఉంటుంది. ఇది గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు ఇవే…

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, డోన్, కర్నూలు సిటీ స్టేషన్లలో ఆగుతుండగా… తెలంగాణలోని గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, షాద్ నగర్, కాచిగూడ, మల్కాజిగిరి, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా రాపోకలు సాగిస్తాయి. హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ, అకోలా, ఇటార్సీ, భోపాల్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, కాన్పూర్, లక్నో, అయోధ్య కాంట్, అయోధ్యధామ్, గోరఖ్పూర్ స్టేషన్లలో కూడా ఆగుతాయి.
ఈ రైలు అయోధ్యధామ్ స్టేషన్ మీదుగా వెళ్తుండటంతో,,,, శ్రీరామచంద్రుని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది సువర్ణావకాశం. సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనున్నాయి.
వేసవిలో సాధారణ రైళ్లలో బెర్తులు దొరకడం కష్టంగా ఉంటుంది కాబట్టి…. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.