SCR Tirupati Nagarsol Special Trains : తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరుపతి – నాగర్సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్…
- రైలు నంబర్ 07427 (తిరుపతి – నాగర్సోల్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 23న (ఆదివారం) తెల్లవారుజామున 03:30 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు అంటే ఆగస్టు 24 (సోమవారం) ఉదయం 08:00 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07428 (నాగర్సోల్ – తిరుపతి) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 26న (బుధవారం) మధ్యాహ్నం 14:30 (2:30) గంటలకు నాగర్సోల్లో బయలుదేరి, మరుసటి రోజు ఆగస్టు 27 (గురువారం) సాయంత్రం 18:45 (6:45) గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
రైలు స్టేషన్లు…

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భణి, జాల్నా, ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) స్టేషన్లలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ సెకండ్ టైర్ , ఏసీ థర్డ్ టైర్ , స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.