స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను టీటీడీ కఠినంగా అమలు చేస్తోందని వెల్లడించింది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించింది. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని కోరింది.

భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
మరోవైపు ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26న ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, అవసరమైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. పెండింగ్లో ఉన్న ప్రధాన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఇటీవల ఆదేశించారు. ముఖ్యంగా మసకబారిన వాహనాలకు పాలిషింగ్ చేయడం, అభిషేకం పీఠం, తాండ్లు తదితర వస్తువులకు బ్రాస్ లైనింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గజ వాహనానికి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు.
ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయం చుట్టుపక్కల వీధుల్లో కూల్ పెయింటింగ్ వేయాలని సూచించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం మెరుగుపరచేందుకు ఆర్.ఓ. వాటర్ ప్లాంట్లు, కూలర్ల నిర్వహణ పనులు చేపట్టాలన్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాష్రూమ్స్ / టాయిలెట్స్లో అవసరమైన ట్యాపులు, తలుపులు, కమోడ్లకు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని చెప్పారు.
యాగశాలను అందంగా, శాస్త్రీయంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కోరారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.
{{/usCountry}}యాగశాలను అందంగా, శాస్త్రీయంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కోరారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.
{{/usCountry}}