ట్రైనీ కానిస్టేబుళ్లకు కూటమి సర్కార్ తీపికబురు - భారీగా స్టైఫండ్ పెంపు
ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులుగా ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి ట్రైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. వీరికి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు... తీపి కబురు చెప్పారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ ను రూ. 12500కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులుగా ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి ట్రైనింగ్ ప్రక్రియ మొదలుకాబోతుంది. మంగళవారం ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపి కబురు చెప్పారు.

స్టైఫండ్ పెంపుపై సీఎం ప్రకటన…
శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ రూ.12,500 కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సంప్రదించి వేదికపైనే ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.4500 నుంచి వారికి స్టైఫండ్ ను ఒక్కసారిగా రూ.12,500 కు పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో ట్రైనీ కానిస్టేబుళ్లు కేరింతలు కొట్టారు.
పోలీసు శాఖలో ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరందరికీ ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
అప్రమత్తంగా ఉండాలి - సీఎం చంద్రబాబు
విజిబుల్ పోలీసింగ్- ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానమే ఇప్పుడు అవసరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పీపీపీ విధానాన్ని పోలిసింగ్ లో అనుసరించాలని సూచంచారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలన్నారు.
“నాలుగేళ్లుగా ఎదురు చూసిన వారికి కూటమి వచ్చాక కోర్టు కేసులు పరిష్కరించి ఇప్పుడు నియాకమపత్రాలను అందించాం. శిక్షణ పూర్తి అవుతూనే పోలీసు కానిస్టేబుళ్లుగా విధుల్లో చేరతారు. గతంతో కలిపి మొత్తం 23,676 ఉద్యోగాలు నేను సీఎంగా ఉన్న సమయంలోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం 75 వేల మంది పోలీసు బలగాల్లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది కూడా మేమే ఉద్యోగం ఇవ్వటమే మా లక్ష్యమని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం” అని చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

