Lunar Eclipse 2026 : చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు

తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు చంద్రగ్రహణం ముగిసిన తర్వాత తెరుచుకున్నాయి. శుద్ధి జరిగిన తర్వాత తలుపులు తెరిచారు.

Updated on: Mar 03, 2026 8:57 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్చి 3 చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేశారు. తర్వాత శుద్ధి, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రాత్రి 8 గంటల నుండి శ్రీవారి భక్తులకు దర్శనం తిరిగి ప్రారంభమైంది. అన్నప్రసాద సముదాయం, లడ్డూ కౌంటర్లు కూడా రాత్రి 8:30 గంటల నుండి పని ప్రారంభించాయి.

చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
  • మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూశారు.
  • దాదాపు 10.30 గంట‌ల అనంత‌రం మంగళవారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

అన్నప్రసాద విత‌ర‌ణ ప్రారంభం

చంద్రగ్రహ‌ణం కార‌ణంగా మంగళవారం ఉదయం 9 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్నప్రసాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.

  • తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసి.. రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు.
  • తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసి రాత్రి 7.30 తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు.
  • శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను ఉదయం 9 గంటలకు క్లోజ్ చేసి రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచారు. తర్వాత శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.