హోటళ్లలో రూమ్ బుక్ చేస్తే ఆధార్ కార్డ్ ఫోటోకాపీకి ఇకపై అనుమతి లేదు.. UIDAI కొత్త రూల్!

హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు మొదలైన సంస్థలు ధృవీకరణ కోసం కస్టమర్ల ఆధార్ కార్డుల ఫోటోకాపీలను తీసుకోవడం అలవాటు. అయితే ఇకపై వీటికి అనుమతి ఉండదు. కొత్త నిబంధనను తీసుకువస్తుంది UIDAI.

Published on: Dec 07, 2025 10:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హోటళ్ళు, ఈవెంట్‌లకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ లేదా వాట్సాప్ ద్వారా ఫోటోకాపీని పంపించమని అడుగుతారు. వెరిఫికేషన్ కోసం దీనిని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. అయితే ఆధార్ సేఫ్టీ బలోపేతం చేయడానికి UIDAI కొత్త నియమాలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం హోటళ్ళు, ఈవెంట్ కంపెనీలు ఆధార్ ఫోటోకాపీలను తీసుకోవడానికి అనుమతి లేదు.

ఆధార్​ కార్డు కొత్త రూల్
ఆధార్​ కార్డు కొత్త రూల్

రిజిస్ట్రేషన్ తర్వాత హోటళ్లు, ఈవెంట్ సంస్థలు క్యూఆర్ స్కాన్ లేదా కొత్త యాప్‌ని ఉపయోగించి పేపర్‌లెస్‌గా వెరిఫికేషన్ చేయాలి. ఇది గోప్యత, డేటా భద్రతను మెరుగుపరుస్తుంది. చాలా మంది ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వాటిని ఎక్కడో పడేస్తుంటారు. దీని ద్వారా కస్టమర్లకు వివరాలు ఎవరి చేతికి వెళ్తాయో తెలియకుండా ఉంటుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కాగితం ఆధారిత ఆధార్ ధృవీకరణను తొలగించడానికి UIDAI పెద్ద మార్పును తీసుకువస్తుంది.

దీని కింద ఓయోతోపాటుగా ఇతర హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు వంటి కంపెనీలు ఇకపై కస్టమర్ల ఆధార్ కార్డుల ఫోటోకాపీలను తీసుకోలేరు. వాటిని భౌతిక రూపంలో అంటే జిరాక్స్ తీసుకుని నిల్వ చేయలేరు. కొత్త నియమం త్వరలో వస్తుందని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఫోటోకాపీలను ఉంచుకోవడం ప్రస్తుత ఆధార్ చట్టానికి విరుద్ధమన్నారు.

ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ కోరుకునే హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు మొదలైన కంపెనీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసే కొత్త నియమాన్ని ఆమోదించినట్టుగా UIDAI సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. ఇది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా ఆధార్ యాప్‌కు కనెక్ట్ చేయడం ద్వారా వ్యక్తులను ధృవీకరించడానికి వీలు కల్పించే కొత్త టెక్నాలజీని వారికి అందించనుంది.

కొత్త నియమాన్ని అథారిటీ ఆమోదించిందని, త్వరలో తెలియజేస్తామని భవనేష్ కుమార్ అన్నారు. హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు వంటి ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అవసరమయ్యే కంపెనీలకు ఇక రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తుంది. ఇకపై పేపర్‌లెస్ ధృవీకరణ ఉండనుంది.

ఆఫ్‌లైన్ ధృవీకరణ అవసరమయ్యే సంస్థలు API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్)కి యాక్సెస్ కలిగి ఉంటాయి. దీని ద్వారా వారు ఆధార్ ధృవీకరణ కోసం తమ సిస్టమ్‌లను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతి ధృవీకరణ కోసం సెంట్రల్ ఆధార్ డేటాబేస్ సర్వర్‌కు కనెక్ట్ చేయకుండానే యాప్-టు-యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించే కొత్త యాప్‌ను UIDAI బీటా-టెస్టింగ్ చేస్తోంది. విమానాశ్రయాలు, దుకాణాల వంటి ప్రదేశాలలో కూడా కొత్త యాప్‌ను ఉపయోగించవచ్చు.