Medha Shankr Break Girl Next Door Image: బాలీవుడ్ బ్యూటి మేధా శంకర్ కెరీర్ 2019లో 'బీచమ్ హౌస్'తో మొదలైనప్పటికీ, ఆమెకు అసలైన గుర్తింపు ఇచ్చింది మాత్రం విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన '12th ఫెయిల్' చిత్రమే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఆ సినిమాలో శ్రద్ధా జోషి పాత్రలో మేధా ఒదిగిపోయిన తీరుకు యావత్ భారతం ఫిదా అయింది.

కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్తో రూపొందిన 12th ఫెయిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్తో సోషల్ మీడియాలో మేధా శంకర్ 'నేషనల్ క్రష్'గా మారిపోయింది.
శ్రద్ధా నుంచి గిన్నీ వరకు: ఇమేజ్ మేకోవర్
తాజాగా మేధా శంకర్ 'గిన్నీ వెడ్స్ సన్నీ 2' సినిమాలో అవినాష్ తివారీతో జతకడుతోంది. ఈ సినిమాలో మేధా ఒక సిటీ అమ్మాయిగా, అరేంజ్డ్ మ్యారేజ్ కోసం అబద్ధాలు ఆడే 'గిన్నీ' పాత్రలో కనిపిస్తుంది. శ్రద్ధా జోషి పాత్రలో ఉన్న అమాయకత్వం, నిశ్శబ్దం ఈ రోల్లో ఉండవు. ఈ పాత్రపై తాజాగా మేధా శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
"గిన్నీ పాత్ర చాలా చురుకైనది, కాస్త అసహనంతో కూడినది. కానీ, శ్రద్ధా లాగే గిన్నీని కూడా ప్రేక్షకులు ప్రేమిస్తారు" అని మేధా శంకర్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక నటిగా తనను తాను నిరూపించుకోవాలంటే ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు అవసరమని ఆమె నమ్ముతోంది.
టైప్కాస్ట్ ముద్ర పడకూడదనేనా?
అయితే, తనకు ఎక్కువగా పక్కింటి తరహా పాత్రలు వస్తున్నాయని, అవే చేసుకుంటూ వెళ్తే పక్కింటి అమ్మాయి అనే ముద్రే పడుతుందని, దాంతో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం ఉండకపోవచ్చని మేధా శంకర్ అభిప్రాయపడుతోంది. అందుకే అందుకోసం కొత్త తరహా పాత్రల కోసం పక్కింటి అమ్మాయి అనే ట్యాగ్, ఇమేజ్ బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు, అందుకే రూట్ మార్చినట్లు మేధా చెబుతోంది.
{{/usCountry}}అయితే, తనకు ఎక్కువగా పక్కింటి తరహా పాత్రలు వస్తున్నాయని, అవే చేసుకుంటూ వెళ్తే పక్కింటి అమ్మాయి అనే ముద్రే పడుతుందని, దాంతో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం ఉండకపోవచ్చని మేధా శంకర్ అభిప్రాయపడుతోంది. అందుకే అందుకోసం కొత్త తరహా పాత్రల కోసం పక్కింటి అమ్మాయి అనే ట్యాగ్, ఇమేజ్ బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు, అందుకే రూట్ మార్చినట్లు మేధా చెబుతోంది.
{{/usCountry}}"12th ఫెయిల్ తర్వాత నాకు వచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఆ ఇమేజ్ (పక్కింటి అమ్మాయి) నుంచి బయటకు రావాలని అనుకున్న మాట వాస్తవమే. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తే అందులో కిక్కు ఏముంటుంది? కష్టమైన సవాళ్లు ఎదుర్కొన్నప్పుడే నటిగా తృప్తి కలుగుతుంది" అని మేధా శంకర్ తన మనసులోని మాటను బయటపెట్టింది. కేవలం సేఫ్ జోన్లో ఉండి సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది.
విడుదల ఎప్పుడు?
కాగా ప్రశాంత్ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2020లో వచ్చిన 'గిన్నీ వెడ్స్ సన్నీ'కి స్పిరిచువల్ సీక్వెల్గా వస్తోంది. సుధీర్ పాండే, లిలెట్ దూబే, గోవింద్ నామ్దేవ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గిన్నీ వెడ్స్ సన్నీ 2 సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల కానుంది. శ్రద్ధా జోషిగా అలరించిన మేధా శంకర్ ఇప్పుడు గిన్నీగా గ్లామరస్ సిటీ అమ్మాయి పాత్రలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.