...
...
Next Story

ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడిపిస్తున్నావని నాకు ఆ బిరుదు ఇచ్చారు, ఇది మన ఇంట్లో కథ: రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

Rajendra Prasad At Pithapuram Lo Ala Modalaindi: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన లేటెస్ట్ మూవీ పిఠాపురంలో అలా మొదలైంది. డైరెక్టర్ మహేష్ చంద్ర దర్శకత్వం వహించిన పిఠాపురంలో అలా మొదలైంది ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 13, 2026, 22:13:14 IST
Advertisement

Rajendra Prasad Speech In Pithapuram Lo Ala Modalaindi Pre Release Event: ప్రేయసి రావే సినిమా డైరెక్టర్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పిఠాపురంలో అలా మొదలైంది. రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ రాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో నటించారు.

పిఠాపురంలో అలా మొదలైంది ప్రీ రిలీజ్ ఈవెంట్

ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడిపిస్తున్నావని నాకు ఆ బిరుదు ఇచ్చారు, ఇది మన ఇంట్లో కథ: రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడిపిస్తున్నావని నాకు ఆ బిరుదు ఇచ్చారు, ఇది మన ఇంట్లో కథ: రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళి (గోదారి కిట్టయ్య) ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పిఠాపురంలో అలా మొదలైంది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురంలో అలా మొదలైంది మూవీ టీజర్‌ను సీనియర్ హీరో సుమన్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్, సుమన్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నటుడు సుమన్ కామెంట్స్

సీనియర్ హీరో, నటుడు సుమన్ మాట్లాడుతూ .. "చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను" అని అన్నారు.

డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ గారు ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు" అని తెలిపారు.

అది నా గొప్పతనం కాదు

"ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది" అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

నా పాత్ర డెప్త్ ఏంటో అర్థమైంది

"చంద్ర మహేష్ ఎలాంటి దర్శకుడో నాకు ముందు నుంచీ తెలుసు. ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది. ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు తను" అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

"ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో ఉండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్" అని కృతజ్ఞత చూపారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.

దండం పెట్టి చెబుతున్నా

"క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ ఉంది. దాంతోపాటే ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నా. దయచేసి ఒక మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి" అని తన స్పీచ్ ముగించారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks