Allu Arjun: హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద తొక్కిసలాట కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు వ్యక్తిగత సమన్లు జారీ చేసింది. వచ్చే సోమవారం ఆయన కచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
అల్లు అర్జున్ కు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును నాంపల్లి హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. అందుకే అల్లు అర్జున్తో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 19 మంది నిందితులకు సమన్లు పంపింది. ఈ కేసులో దాఖలైన చార్జ్షీట్లో పోలీసులు అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A11) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది.
అసలేం జరిగిందంటే?
'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలను పురస్కరించుకుని 2024 డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిమానులను అలరించేందుకు హీరో అల్లు అర్జున్ స్వయంగా థియేటర్ వద్దకు వచ్చారు.
అయితే, ముందస్తు అనుమతులు లేకుండా, సరైన ప్లాన్ లేకుండా అల్లు అర్జున్ ర్యాలీలా రావడంతో అక్కడ ఒక్కసారిగా అరాచక వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు ఒకేసారి ఎగబడటంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది.
ఒకరి మృతి
ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చాలా నెలల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు విచారణ జరిపారు. ఈ ఈవెంట్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, క్రౌడ్ మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని తేల్చారు.
{{/usCountry}}ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చాలా నెలల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు విచారణ జరిపారు. ఈ ఈవెంట్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, క్రౌడ్ మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని తేల్చారు.
{{/usCountry}}థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులతో పాటు నిబంధనలు ఉల్లంఘించి అక్కడికి వచ్చినందుకు అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై కూడా పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. మరోవైపు బాధితురాలి కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబం అండగా నిలుస్తోంది.
23 మంది
మొత్తం 23 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చగా, ప్రస్తుత విచారణల అనంతరం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ (A11) సహా 19 మందికి తాజాగా సమన్లు జారీ చేయడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. చట్టప్రకారం సోమవారం అల్లు అర్జున్ న్యాయమూర్తి ముందు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక రాత్రి జైల్లో
అయితే ఇదే కేసులో అల్లు అర్జున్ ను గతంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను జైలుకు తరలించారు. అయితే హై కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు.