Bhajan: అనంత్ అంబానీ బర్త్డే వేడుకలో భక్తి పారవశ్యం- భజనలో మునిగిపోయిన షారుక్ ఖాన్ భార్య, రణ్వీర్ సింగ్, జాన్వీ కపూర్
Anant Ambani Birthday Celebrations With Bhajan: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ 31వ పుట్టినరోజు వేడుకలు జాంనగర్లో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా వంటారా యూనివర్సిటీని ప్రారంభించడంతో పాటు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి నిర్వహించిన భజన కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన 31వ పుట్టినరోజును (ఏప్రిల్ 10) గుజరాత్లోని జాంనగర్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు సంరక్షణ ప్రాజెక్ట్ 'వంటారా' (Vantara) విస్తరణలో భాగంగా 'వంటారా యూనివర్సిటీ'ని కూడా ఇదే వేదికపై ప్రారంభించారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై అనంత్ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా ఈ విశ్వవిద్యాలయం నిలవనుంది.

భజనలో మునిగిపోయిన రణ్వీర్ సింగ్, గౌరీ ఖాన్
సాధారణంగా అంబానీ ఇళ్లలో పార్టీలు అంటే పాశ్చాత్య సంగీతం, డ్యాన్స్లు ఉంటాయని అందరూ ఊహిస్తారు. కానీ, అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి పారవశ్యంతో సాగడం విశేషం. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ పక్కనే కూర్చున్న రణ్వీర్ పూర్తి భక్తిశ్రద్ధలతో భజన పాడుతూ కనిపించారు.
మరోవైపు షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్, తన కుమారుడు అబ్రామ్ ఖాన్తో కలిసి అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలోని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. చేతులు జోడించి ప్రశాంతంగా భక్తి గీతాలను వింటున్న గౌరీ ఖాన్ వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సెలబ్రిటీలు సైతం తమ హోదాలను పక్కన పెట్టి ఆధ్యాత్మికతలో లీనమవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
గర్బా ఆడిన జాన్వీ కపూర్.. కేక్ కటింగ్ సందడి
బాలీవుడ్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కూడా ఈ భజన వేడుకలో సందడి చేశారు. సంప్రదాయబద్ధమైన లాంగ్ స్కర్ట్, టాప్ ధరించిన జాన్వీ కపూర్ భజన సమయంలోనే తోటి అతిథులతో కలిసి గ్రేస్ఫుల్గా గర్బా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత రణ్వీర్ సింగ్, జాన్వీ కపూర్ కలిసి అనంత్ అంబానీతో కేక్ కట్ చేయించారు. బ్లూ కలర్ ఫార్మల్ సూట్లో రణ్వీర్ మెరవగా, ఎత్నిక్ వేర్లో జాన్వీ చాలా అందంగా మెరిసిపోయారు.
"దేశాన్ని ముందుకు నడిపిస్తాడు": సల్మాన్ ఖాన్ ప్రశంసలు
ఈ పుట్టినరోజు వేడుకలకు బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ కొత్త లుక్లో హాజరయ్యారు. సోడాద్దాలు ధరించి విభిన్నమైన స్టైల్లో కనిపించిన సల్మాన్, అనంత్ అంబానీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా అనంత్ను ఆకాశానికెత్తేస్తూ సల్మాన్ ఒక పోస్ట్ పెట్టారు.
"ఒకవేళ మీ జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే ఈ మాటను రాసి పెట్టుకోండి. ఈ వ్యక్తి (అనంత్) భవిష్యత్తులో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. మనసు, మేథస్సు ఉన్న అంబానీ మన అనంత్. అతను చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి" అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.
షారుఖ్ ఖాన్ అభినందనలు
అలాగే, కింగ్ ఖాన్ షారుఖ్ సైతం అనంత్ అంబానీకి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "అనంత్ అంబానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చేస్తున్న మంచి పనులను ఇలాగే కొనసాగించు. సానుకూల దృక్పథంతో ఉంటూ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ ఉండు. భగవంతుడు నీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలి" అని షారుఖ్ ఖాన్ ఆకాంక్షించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


