తమిళంలో మంచి ఆదరణ దక్కింది.. తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ ఎక్కువైంది.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం బైసన్. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. అక్టోబర్ 24న తెలుగులో బైసన్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన బైసన్ ప్రెస్ మీట్లో హీరోయన్ అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటిపుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే పరదా సినిమాతో పర్వాలేదనిపించుకున్న అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపురి వంటి హారర్ థ్రిల్లర్తో సక్సెస్ కొట్టింది. ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుపమ పరమేశ్వరన్.
తమిళంలో మంచి ఆదరణ దక్కింది.. తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ ఎక్కువైంది.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
అనుపమ పరమేశ్వరన్ తమిళ చిత్రం
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమిళంలో నటించిన చిత్రం బైసన్. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా చేశాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన బైసన్ సినిమా అదివరకే తమిళంలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో బైసన్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో బైసన్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన బైసన్ ప్రెస్ మీట్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ పలు విశేషాలు చెప్పుకొచ్చింది.
మొదటి చిత్రంలో నేను నటించాలి
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ .. "మారి సెల్వరాజ్ గారి మొదటి చిత్రంలో నేను నటించాల్సింది. కానీ, అప్పుడు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆయన తీసిన ‘బైసన్’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నేను చాలా నేర్చుకున్నాను" అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
డిమాండ్ ఎక్కువైంది
"తమిళంలో ఆల్రెడీ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా ఎక్కువైంది. మేం అక్టోబర్ 24న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ధృవ్కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉందని, ఎంతో కష్టపడ్డాడు అని నేను రిలీజ్కు ముందు చెప్పాను. ఇప్పుడు అవే మాటలు ప్రేక్షకులు కూడా చెబుతున్నారు" అని అనుపమ పరమేశ్వరన్ పేర్కొంది.
అద్భుతమైన పాటలు, మ్యూజిక్
"ధృవ్తో నటించడం నాకు గర్వంగా ఉంది. నివాస్ మాకు అద్భుతమైన పాటలు, మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న జగదంబే బాలాజీ గారికి థాంక్స్. అక్టోబర్ 24న ‘బైసన్’ తెలుగులో రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి" అని కోరారు బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.
బోస్, బాలాజీ గారి పట్టుదల
ఇదే ఈవెంట్లో నీలం స్టూడియోస్ వీపీఆర్ మాట్లాడుతూ .. "మా ‘బైసన్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న బాలాజీ గారికి థాంక్స్. బోస్, బాలాజీ గారి పట్టుదల వల్లే తెలుగులో ఇంత గ్రాండ్గా ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను తప్పకుండా చూడండి" అని కోరారు.