బ్రహ్మముడి జనవరి 15 ఎపిసోడ్: బిడ్డలను మార్చిన రుద్రాణి- మంత్రి కూతురుగా కావ్య పాప- నిర్దోషిగా రాజ్, నిరూపించిన అప్పు

బ్రహ్మముడి సీరియల్ జనవరి 15 ఎపిసోడ్‌లో కావ్యకు పాప పుడుతుంది. పాప బరువు తక్కువ ఉందని ఇంక్యూబెటర్‌లో పెడతారు. అక్కడ బిడ్డలను మార్చేస్తుంది రుద్రాణి. మరోవైపు రాజ్‌ను సాక్ష్యాలతో నేరం చేయలేదని నిరూపిస్తుంది అప్పు. మరోవైపు తన దగ్గర ఉన్న పాప తనకు పుట్టలేదని కావ్య గోల చేస్తుంది.

Published on: Jan 15, 2026, 08:55:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో డాక్టర్‌తో కావ్య కోపరేట్ చేస్తుంది. ఆపరేషన్ చేయమని రాజ్ అంటాడు. కానీ, డాక్టర్ కోప్పడుతుంది. క్రిమినల్ ఉండగా ఆపరేషన్ చేయలేం, మా హాస్పిటల్‌కు చెడ్డపేరు వస్తుందని డాక్టర్ అంటుంది. నా భార్య బిడ్డకు ప్రాణం పోయాలంతే ప్రాణాలతో ఉండాలి. నా భార్య ప్రాణం నేనే. అందుకు నేనే ఇక్కడే ఉండాలి అని వేడుకుంటాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 15 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 15 ఎపిసోడ్

అరెస్ట్ చేసి తీసుకెళ్లండి

నా భార్య డెలివరి అవ్వగానే బిడ్డను చూసి వెళ్లిపోతానని రాజ్ అంటాడు. కావ్య కూడా వేడుకుంటుంది. దాంతో డాక్టర్ ఒప్పుకుంటుంది. మరోవైపు బావ ఇంకా కేసులో ఇరుక్కోవద్దనే అరెస్ట్ చేస్తానని అన్నాను అని అప్పు అంటుంది. అయినా ఇంట్లోవాళ్లు వినరు. అప్పును తిడతారు.

నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఆఫ్ డ్యూటీలో ఉన్న నాకు ఆర్డర్స్ వచ్చాయంటే ఎంత ప్రెజర్ ఉందో తెలుసుకోండి అని అప్పు అంటుంది. అంత డ్యూటీ చేయాలనుకుంటే రాజ్‌ను బయటకు తీసుకురమ్మని ఇంట్లో వాళ్లు అంటారు. రాజ్ బయటకు వచ్చాక అరెస్ట్ చేస్తామని కానిస్టేబుల్స్ అంటారు. నేను నా అత్తింటి వాళ్ల ముందు దోషిలా నిలబడ్డాను. రెండు నిండు ప్రాణాలు కాపాడటానికి నా కుటుంబానికి సహకరించాను. సారీ. మా బావ బయటకు రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లండి అని అప్పు చెబుతుంది.

బావ ఇంట్లోకి పర్మనెంట్‌గా ఉండాలంటే అరెస్ట్ కావాలి. ఏదోటి చేసి బయటకు తీసుకొస్తా అని అప్పు అంటుంది. మరోవైపు రాజ్ సమక్షంలోనే కావ్యకు డెలివరి చేస్తారు. ఇంకోవైపు మినిస్టర్ ధర్మేంద్ర భార్య తులసికి కూడా డెలివరి చేస్తారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అప్పు రాజ్ కేసు ఫైల్ ఇవ్వమంటుంది. తర్వాత శాండీ సెల్ ఓపెన్ చేయమంటుంది అప్పు.

రాజ్‌ను నిర్దోషిగా నిరూపించిన అప్పు

లాఠీ పట్టుకుని దొంగ బంగారం గురించి ప్రశ్నిస్తుంది అప్పు. శాండీ అబద్ధం చెప్పడంతో నిజం చెప్పమని లాకప్‌లో శాండీని కొడుతుంది అప్పు. ఇంతలో ఎస్సై వచ్చి ఏంటని అడిగితే.. శాండిని ఇంట్రాగేట్ చేస్తున్నారని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో అప్పును అడ్డుకుంటాడు ఎస్సై. సాక్ష్యాలతోనే ఇదంతా చేస్తున్నాను అని అప్పు అంటుంది.

ఎఫ్ఐఆర్ తీసుకురమ్మని జనవరి 6న రాజ్‌ను కలిసిన శాండీ జనవరి 10న గోల్డ్ అమ్మినట్లు చెప్పాడు. కానీ, జనవరి 10న మా బావ ఆఫీస్‌కే వెళ్లలేదు. ఆరోజు మా ఇంట్లో మాకు సీమంతం చేశారు. కావాలంటే మీరు వీడియోలు, ఫొటోలు చూడొచ్చు అని చెప్పి కల్యాణ్‌తో చూపిస్తుంది అప్పు. అవి చూసిన ఎస్సై శాండీ అబద్ధం చెప్పాడని నమ్ముతాడు.

వీడితోనే నిజం రప్పించమని ఎస్సై అంటాడు. ఇదంతా ఎవరు చేయించమన్నారు అని అప్పు అడుగుతుంది. కానీ, శాండీ మాత్రం రాహుల్‌తో జరిగింది గుర్తు చేసుకుంటాడు. వెనుక ముందు ఎవరు లేరు. పగతోనే ఇదంతా చేశానని చెప్పమని రాహుల్ చెప్పింది గుర్తు చేసుకుంటాడు శాండీ. అలాగే చెబుతాడు శాండీ.

బిడ్డలను మార్చిన రుద్రాణి

మీ బావ రాజ్ ఏ నేరం చేయలేదని తేలిపోయింది. వెంటనే సాక్ష్యాలతో జడ్జ్ గారిని కలిసి విడిపించాలి అని ఎస్సై వెళ్తాడు. మరోవైపు కావ్యకు బిడ్డ పుడుతుంది. పాపను చూస్తూ కావ్య మురిసిపోతుంది. తర్వాత వెయిట్ తక్కువ ఉందని ఇంక్యూబెటర్‌లో వేస్తారు.

కావ్యకు పాప పుట్టిందని, కాసేపట్లో చూడొచ్చు అని ఇంట్లోవాళ్లకు నర్స్ చెబుతుంది. మరోవైపు తులసి పాప ఏడవట్లేదు అని డాక్టర్స్ కంగారు పడతారు. పాపను అర్జంట్‌గా ఇంక్యూబెటర్‌‌లో పెట్టమని డాక్టర్ చెబుతాడు. తర్వాత ధర్మేంద్ర దగ్గరికి వెళ్లిన రుద్రాణి వాళ్ల పాప చనిపోయిందని, పాపను మార్చాలని చెబుతుంది.

దానికి మంత్రి ధర్మేంద్ర ఒప్పుకుంటాడు. కావ్య బిడ్డను మార్చి తులసి దగ్గర, తులసి బిడ్డను కావ్య దగ్గర పెడుతుంది రుద్రాణి. పాపను చూసిన కావ్య తనకు పుట్టిన బిడ్డ కాదని గోల చేస్తుంది. మంత్రి కూతురుగా కావ్య పాప పెరుగుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More