...
...
Next Story

Brahmamudi July 14 Episode: బ్రహ్మముడి- రాజు సేఫ్, మరదలి సేవలు- లక్కీ తల్లి రేఖ అని ఇందుకు చెప్పిన బావ- రేఖ సైకోయిజం

Brahmamudi Serial July 14 Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 14వ ఎపిసోడ్‌‌లో రాజు తనను తాను కాపాడుకోవాలిగా అని అపర్ణకు చెబుతుంది. దాంతో అపర్ణ కంగారుపడుతుంది. రాజు బతకాలని దేవుడికి మొరపెట్టుకుంటుంది ఇందు. రాజు సేఫ్ అని డాక్టర్ చెబుతాడు. చలపతి ఇంట్లో రాజుకు మరదలు ఇందు సేవలు చేస్తుంది.

Published on: Jul 14, 2026, 08:38:21 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందుకు రాజు దుగ్గిరాల వారసుడని, తాము పెంచిన కొడుకుని, ఇందును రాజు జీవితంలో నుంచి తప్పుకోమని చలపతి అంటాడు. ఇందు కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధగా వారి దగ్గరి నుంచి ఇందు వెళ్తుంది.

వాడిని వాడు కాపాడుకోవాలిగా

బ్రహ్మముడి సీరియల్ జూలై 14వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూలై 14వ ఎపిసోడ్

మరోవైపు రేఖ సంతోషంగా ఉంటుంది. అపర్ణతో వెళ్లి మాట్లాడుతుంది. ఇందును రాజు కాపాడాలంటే ముందు వాడిని వాడు కాపాడుకోవాలిగా. వాడు ఇక ఇక్కడికి ఎప్పుడు రాలేడు. వాడు అసలు ఈ భూమ్మీదే ఎక్కడ కనిపించడు అని రేఖ అంటుంది. దాంతో అపర్ణ కంగారుపడుతుంది.

నీ అసలు కొడుకు లాగే వీడు కూడా అంతమైపోతాడు అని రేఖ అంటుంది. నీకెందుకు అంత సంతోషం, ఎదుటివాళ్ల నాశనం కోరుకుంటే ఏం వస్తుందని అపర్ణ అంటుంది. ఆనందం వస్తుంది. మీ నాశనం కోరుకుంటే నాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అని సైకోలా ప్రవర్తిస్తుంది రేఖ. ఆ రాజు గాడు వచ్చాడు వెళ్లిపోయాడు. ఇక ఆ రాజును మర్చిపోండని రేఖ చెప్పేసి వెళ్లిపోతుంది.

దాంతో భయంతో రాజుకు అపర్ణ కాల్ చేస్తే స్విచ్ఛాప్ వస్తుంది. ఇందుకు కాల్ చేస్తుంది అపర్ణ. ఇందు కూడా చూసి లిఫ్ట్ చేయదు. రాజు క్షేమంగా ఉండాలని తన ఆయుష్షు కూడా తీసుకోమని దేవుడిని కోరుకుంటాడు చలపతి. వాడు ధనవంతుడిగా పుట్టి పేదరికంలో పెరిగాడు. ఎప్పటికైనా వాడు రాజులా బతుకుతాడు. నేను లేకున్నా సరే వాడు బతికితే చాలు కదా అని చలపతి అంటాడు.

ఎంత డబ్బు ఖర్చు అయిన పర్లేదు

ఎంత డబ్బు ఖర్చు అయిన పర్వాలేదు. నేను ఇస్తానని ఇందు అంటుంది. డబ్బుతోనే అన్ని అయితే డబ్బున్నోళ్లకు చావే ఉండదని డాక్టర్ వెళ్లిపోతాడు. ఇందుపై ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావని కోప్పడుతాడు చలపతి. ఊరుకోండి. ఉండని అని లక్ష్మీ అంటుంది. ఆస్పత్రిలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్లిన ఇందు జరిగిన విషయాల గురించి మొరపెట్టుకుంటుంది.

నాకోసం ఒక బంధాన్ని తోడుగా ఉంచావ్. మళ్లీ అదే బంధాన్ని ఆస్పత్రి పాలు చేశావ్. మా నానమ్మ తాతయ్య డౌట్ పడిన నేను నమ్మలేదు. నాకు అండగా ఉండాలని నువ్వే నా బావను పంపించావని నాకు అర్థమైంది. నా బావకు ఏమైనా అయితే నేను భరించలేను. నాకు నా బావ కావాలి స్వామి. తనకేం కాకూడదు. తనను నాకు దూరం చేయొద్దు. ఎలాగైనా నా బావను కాపాడు అని దండం పెట్టుకుని కోరుకుంటుంది ఇందు.

చలపతిని బతిమిలాడిన ఇందు

మరోవైపు రాజు ఫోన్ స్విచ్ఛాఫ్, ఇందు కాల్ లిఫ్ట్ చేయకపోవడం గురించి ఇందు ఎక్కడికి వెళ్లిందని అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చి రాజు బాగానే ఉన్నాడని, కాలు కొంచెం మిస్‌లొకేట్ అయిందని, వారం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెబుతాడు. స్పృహలోకి వచ్చాక డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

దాంతో చలపతి, ఇందు సంతోషిస్తారు. ఇందును చలపతి వెళ్లిపోమని ఇక రాజు జీవితంలోకి రాకనంటాడు. అది కుదరదు అంకుల్. తను నా బావ. నా బావను వదిలి వెళ్లలేను. తను నా బావ అని తెలియక మీ ఇంటికి పంపించాను. నా బావను నాతోపాటే నా ఇంటికి తీసుకెళ్తాను అని ఇందు అంటుంది. దాంతో చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు.

అర్థం చేసుకుంటారని నిజం చెబితే ఇలా అంటావేంటమ్మా అని చలపతి బాధపడతాడు. రాజు మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టే రేఖ ఆంటీ ఇలా చేయించగలిగింది. మా ఇంట్లో ఉంటే ఇలా జరిగేదు కాదు. అందుకే నా బావను ఇంటికి తీసుకెళ్తానంటున్నాను. తన ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. మా నానమ్మ, తాతయ్య రాజును చూడకుండా ఉండలేకపోతున్నారు అని ఇందు చెబుతుంది.

మా ఇంట్లో కాపాడుకోగలను

మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. మా కష్టాలు దూరం చేసేందుకు రాజును దేవుడు పంపించాడు. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు అని ఇందు అంటుంది. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో అని భయపడుతూ బతకలేమని చలపతి అంటాడు. తనకు రేఖ ఆంటీ నుంచి ప్రమాదం ఉంది. కానీ, మీ ఇంట్లో ఉంటే నేను కాపాడుకోలేను. మా ఇంట్లో కాపాడుకోగలను అని ఇందు అంటుంది.

చలపతి ఆలోచిస్తాడు. కానీ, ఒప్పుకోడు. తర్వాత రాజును డిశ్చార్జ్ చేస్తారు. చలపతి ఇంటికి రాజు వెళ్తాడు. అక్కడ రాజుకు ఇందు సేవలు చేస్తుంటుంది. అది చూసి రేఖ షాక్ అవుతుంది. వెళ్లి పరామర్శిస్తుంది. నువ్వే చంపాలని ట్రై చేశావని నాకు తెలుసు. లక్కీ గాడు నీ కొడుకు అనే విషయం పాతిపెట్టేందుకే ఇలా చేశావని నాకు తెలుసు అని రాజు అంటాడు.

రేఖకు మైండ్ బ్లాక్

లక్కీ గాడి తల్లివి నువ్వే అనే విషయం నేను ఇంకొకరికి కూడా చెప్పాను అని రాజు అంటాడు. ఇందు రేఖనే చూస్తుంది. రేఖకు మైండ్ బ్లాక్ అవుతుంది. లక్కీ తల్లి రేఖ అనే నిజం ఇందుకు కూడా తెలిసిపోయింది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe