Celina Jaitly Twins Read Her Divorce: ఒకప్పుడు బాలీవుడ్లో గ్లామర్ క్వీన్గా వెలిగిన మాజీ మిస్ ఇండియా, తెలుగు సీనియర్ హీరోయిన్ సెలీనా జైట్లీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. భర్త పీటర్ హాగ్ నుంచి విడిపోవడానికి ఆమె చట్టపరమైన పోరాటం చేస్తున్నారు.
15వ పెళ్లి రోజునాడే

అయితే సెలీనా జైట్లీ విడాకుల వ్యవహారం రోజురోజుకూ అత్యంత బాధాకరంగా మారుతోంది. తన 15వ పెళ్లి రోజునాడే భర్త చేతికి విడాకుల పత్రాలు ఇవ్వడం, ఆ సమయంలో ఎదురైన ఘోర అవమానాలను గుర్తుచేసుకుంటూ సెలీనా కన్నీటిపర్యంతమయ్యారు.
2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్ను సెలీనా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అయితే, కొన్నేళ్లుగా భర్త నుంచి ఎదురవుతున్న మానసిక, శారీరక వేధింపులను తట్టుకోలేక 2025 నవంబర్లో సెలీనా ముంబై పోలీసులను ఆశ్రయించారు. పీటర్ హాగ్పై గృహహింస చట్టం కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
కన్నబిడ్డలే చదివి వినిపించిన విడాకుల నోటీసు!
"నా 15వ పెళ్లి రోజున ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇస్తాడని అనుకున్నా. కానీ, నా భర్త నన్ను పోస్టాఫీసుకు తీసుకెళ్లి కొన్ని పేపర్లు చేతిలో పెట్టాడు. ఆ నోటీసు పూర్తిగా జర్మన్ భాషలో ఉంది. నాకు అంత బాగా జర్మన్ రాదు. దాంతో అందులో ఏముందో అనువదించి చెప్పమని నా భర్తను అడిగా. కానీ అతను నిరాకరించి, నన్ను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు" అని సెలీనా చెప్పారు.
ఇంటికి వెళ్లేసరికి తన కవల పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారని, దాంతో ఆ పేపర్లు చదవమని వాళ్లకు ఇచ్చానని ఆమె తెలిపారు. "ఆ చిన్నారులు తమ తల్లిపై తండ్రి రాసిన దారుణమైన ఆరోపణలను చదివి నాకు వినిపించాల్సి వచ్చింది. నా భర్త అవసరాలకు నేను సరిపోవడం లేదంటూ, మా పెళ్లి బంధం ముగిసిపోయిందంటూ అందులో రాశారు. మొదట అదొక జోక్ అనుకున్నా" అని సెలీనా జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు.
క్లీనర్ పని చేసుకోమంటూ భర్త అవమానం
{{/usCountry}}ఇంటికి వెళ్లేసరికి తన కవల పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారని, దాంతో ఆ పేపర్లు చదవమని వాళ్లకు ఇచ్చానని ఆమె తెలిపారు. "ఆ చిన్నారులు తమ తల్లిపై తండ్రి రాసిన దారుణమైన ఆరోపణలను చదివి నాకు వినిపించాల్సి వచ్చింది. నా భర్త అవసరాలకు నేను సరిపోవడం లేదంటూ, మా పెళ్లి బంధం ముగిసిపోయిందంటూ అందులో రాశారు. మొదట అదొక జోక్ అనుకున్నా" అని సెలీనా జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు.
క్లీనర్ పని చేసుకోమంటూ భర్త అవమానం
{{/usCountry}}కోర్టు సూచనల ప్రకారం విడాకుల ప్రక్రియను సామరస్యంగా ముగించుకోవడానికి సెలీనా జైట్లీ ప్రయత్నించారు. తనకు ఎలాంటి భరణం వద్దని, కేవలం తాను పెట్టిన పెట్టుబడి, ఆస్తులు తిరిగి ఇచ్చేసి, పిల్లల సంరక్షణ బాధ్యతలను (Joint Custody) ఇద్దరూ పంచుకుంటే చాలని ప్రతిపాదించారు. అయితే దీనికి ఆమె భర్త, అతని తరఫు లాయర్లు దారుణమైన షరతులు విధించారు.
"విడాకుల తర్వాత నన్ను ముంబై వెళ్లనివ్వనని లాయర్ చెప్పారు. పిల్లలను చూడాలంటే ఆస్ట్రియాలోనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని నా భర్త కరాఖండిగా చెప్పాడు. నేనేం పని చేయాలని అడిగితే.. ఒక సూపర్మార్కెట్లో క్లీనర్ పని ఇప్పిస్తానని, మీ ఇండియాలో లాగా ఇక్కడ ఏ పనినీ తక్కువగా చూడరని నన్ను ఎగతాళి చేశాడు" అని సెలీనా జైట్లీ వాపోయారు.
ముదిరిన కోర్టు వివాదం.. ఎదురుదాడి చేస్తున్న భర్త
సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్, మామ వోల్ఫ్గ్యాంగ్ జె. హాగ్లపై గృహహింస, వేధింపుల కేసులు పెట్టి భరణం, నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు. జాయింట్ కస్టడీ ఉన్నప్పటికీ పిల్లలను తనతో మాట్లాడనివ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు.
మరోవైపు భర్త కుటుంబం కూడా సెలీనాపై ఎదురుదాడికి దిగింది. ముంబైకి చెందిన లా ఫర్మ్ ద్వారా సెలీనాకు లీగల్ నోటీసులు పంపారు. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి ఒకప్పటి స్టార్ హీరోయిన్ జీవితం ఇలా కోర్టులు, వివాదాల చుట్టూ తిరగడం బాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.