CM Revanth Reddy SRH Vs CSK IPL Tickets To Kushita Kallapu: హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం (ఏప్రిల్ 18) జరిగిన ఎస్ఆర్హెచ్ (SRH) వర్సెస్ సీఎస్కే (CSK) ఐపీఎల్ మ్యాచ్ ఎంత జోరుగా సాగిందో దానికి సంబంధించిన టికెట్స్ సైతం బయట హాట్ టాపిక్గా మారింది. ఈ మ్యాచ్ టికెట్స్కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.
ఒక్కో టికెట్కు 40 వేలు

సాధారణంగా ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాస్లు పంపిస్తారు. అయితే, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే ఐపీఎల్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి పంపిన రెండు టికెట్లు ఊహించని విధంగా ఓటీటీ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 హీరోయిన్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు చేతికి చేరాయి.
ఒక్కో టికెట్ విలువ అక్షరాలా రూ. 40,000 అని సమాచారం. ఈ టికెట్లు ఉంటే స్టేడియంలోని అత్యంత విలాసవంతమైన 'సన్రైజర్స్ ఎలైట్ లాంజ్'లో కూర్చుని మ్యాచ్ వీక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న ఐపీఎల్ టికెట్స్ హీరోయిన్ కుషిత కల్లపు చేతికి ఎలా వెళ్లాయనే విషయంపై ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్
అయితే, ఈ టికెట్ల వ్యవహారం బయటపడటానికి కారణం కుషితనే కావడం గమనార్హం. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆ రెండు టికెట్ల ఫోటోలను కుషిత కల్లపు పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 1.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆమె పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కుషిత కల్లపు గతంలో ‘చాంగురే బంగారు రాజా’, ‘నీతోనే నేను’, ‘బాబు - నెంబర్ 1 బుల్ షిట్ గయ్’తోపాటు ‘3 రోజెస్ సీజన్ 2’, ‘చిరంజీవ’ వంటి ఓటీటీ సినిమాల్లో కూడా నటించింది. సీఎం కార్యాలయానికి (CMO) చేరాల్సిన ఈ పాస్లు కుషిత దగ్గరకు ఎలా వెళ్లాయనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
రాజకీయ ప్రాధాన్యత వర్సెస్ వ్యక్తిగత ప్రయోజనం
{{/usCountry}}కుషిత కల్లపు గతంలో ‘చాంగురే బంగారు రాజా’, ‘నీతోనే నేను’, ‘బాబు - నెంబర్ 1 బుల్ షిట్ గయ్’తోపాటు ‘3 రోజెస్ సీజన్ 2’, ‘చిరంజీవ’ వంటి ఓటీటీ సినిమాల్లో కూడా నటించింది. సీఎం కార్యాలయానికి (CMO) చేరాల్సిన ఈ పాస్లు కుషిత దగ్గరకు ఎలా వెళ్లాయనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
రాజకీయ ప్రాధాన్యత వర్సెస్ వ్యక్తిగత ప్రయోజనం
{{/usCountry}}ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేదా స్టేడియం అథారిటీ ఇచ్చే ఈ ప్రోటోకాల్ పాస్లు ప్రభుత్వ సమన్వయం, భద్రత లేదా అధికారిక అతిథుల కోసం కేటాయిస్తారు. ఇవి సీఎంఓ సిబ్బందికి లేదా రాజకీయ నేతలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తి కాదు. వీటిని అధికారిక అవసరాలకు కాకుండా, ఇలా స్నేహితులకు లేదా ఇష్టమొచ్చిన వారికి పంపిణీ చేయడం నైతిక, చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
వివాదాలకు నిలయంగా మారిన కాంప్లిమెంటరీ టికెట్లు
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఉన్న పాస్లు బయట వ్యక్తుల చేతికి వెళ్లడం భద్రతా పరమైన లోపంగా కూడా కొందరు భావిస్తున్నారు. నిజానికి ఉప్పల్ స్టేడియంలో టికెట్ల పంపిణీ వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్రైజర్స్ మేనేజ్మెంట్ మధ్య టికెట్ల కోటా విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది.
2025లో అదనపు టికెట్ల కోసం హెచ్సీఏ నిర్వాహకులు స్టేడియానికి నీళ్లు, విద్యుత్ సరఫరా ఆపేస్తామని బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని, అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కె. శ్రీనివాసరెడ్డితో విచారణకు ఆదేశించారు. ఇంతటి సున్నితమైన నేపథ్యంలో, మళ్లీ సీఎం పాస్లే దారి తప్పడం చర్చనీయాంశమైంది.