సంక్రాంతి 2026 స్పెషల్ గా ఓటీటీలోకి లేటెస్ట్ మూవీ దండోరా వచ్చింది. సీనియర్ నటుడు శివాజీ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఇవాళ (జనవరి 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. పొంగల్ పండగ సందర్భంగా ఈ సినిమాను ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.
దండోరా ఓటీటీ

రీసెంట్ గా హీరోయిన్ల దుస్తులపై అసభ్యకర కామెంట్లతో శివాజీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే శివాజీ ఈ కామెంట్లు చేశారు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.
20 రోజుల్లో ఓటీటీలోకి
థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లో దండోరా మూవీ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇందులో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు తదితరులు నటించారు. దీనికి మురళీకాంత్ డైరెక్టర్.
శివాజీ తన యాక్టింగ్ సెకండ్ ఇన్నింగ్స్ లో జనాలను హత్తుకునే పాత్రలతో పాటు పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈటీవీ విన్ లో వచ్చిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ లో టీచర్, తండ్రిగా గొప్పగా నటించారు. ఆ తర్వాత కోర్టు సినిమాలో మంగపతిగా విలనిజం చూపించారు. ఇప్పుడు దండోరాలోనూ మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు.
దండోరా కథ
మెదక్ జిల్లాలోని తుళ్లూరు అనే పల్లెటూరు. అక్కడ శివాజీ (శివాజీ) ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి. ప్రాణం పోయినా సరే కుల గౌరవం తగ్గకూడదని భావించే రకం. అతని కొడుకు విష్ణు (నందు) సిటీలో ఉంటాడు, కూతురు (మనిక చిక్కాల) ఊళ్లోనే ఉంటుంది. అయితే, అతని కూతురు వేరే కులం అబ్బాయి (రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. ఇది తెలిసిన శివాజీ ఆవేశంతో రగిలిపోతాడు.
{{/usCountry}}మెదక్ జిల్లాలోని తుళ్లూరు అనే పల్లెటూరు. అక్కడ శివాజీ (శివాజీ) ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి. ప్రాణం పోయినా సరే కుల గౌరవం తగ్గకూడదని భావించే రకం. అతని కొడుకు విష్ణు (నందు) సిటీలో ఉంటాడు, కూతురు (మనిక చిక్కాల) ఊళ్లోనే ఉంటుంది. అయితే, అతని కూతురు వేరే కులం అబ్బాయి (రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. ఇది తెలిసిన శివాజీ ఆవేశంతో రగిలిపోతాడు.
{{/usCountry}}అయితే, కొన్ని కారణాల వల్ల శివాజీ చనిపోతాడు. అతని శవాన్ని ఊరి శ్మశానంలో ఖననం చేసేందుకు కుల పెద్దలు ఒప్పుకోరు. దాంతో ఊరి జనం మధ్య గొడవ మొదలవుతుంది.
అసలు శివాజీని తన కులమే ఎందుకు బహిష్కరించింది? అతడి గతమేంటీ? ఆ ఊరి సర్పంచ్ (నవదీప్) ఈ విషయంలో ఏం చేశారు? శివాజీ కొడుకు విష్ణు అతనితో ఏళ్లుగా ఎందుకు మాట్లాడలేదు? వేశ్య శ్రీలత (బిందు మాధవి)కి శివాజీకి ఉన్న సంబంధం ఏంటీ? అనేది తెలియాలంటే దండోరా చూడాల్సిందే.