Dhurandhar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ

2025లో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రణ్‌వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ధురంధర్’ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ స్పై థ్రిల్లర్.. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jan 21, 2026 4:22 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) డిజిటల్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రికార్డుల మోత మోగించి, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

Dhurandhar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ
Dhurandhar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ

ధురంధర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

ధురంధర్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. జనవరి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. సీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలో తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో ప్రాంతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం.

బాక్సాఫీస్ రికార్డులు, ఓటీటీ డీల్..

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్’గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1,283 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు ఓటీటీ డీల్ కూడా భారీగానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాతో పాటు దీని సీక్వెల్ హక్కులను కలిపి సుమారు రూ. 130 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ధురంధర్ మూవీ స్టోరీ ఇదీ

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్‌ ధురంధర్. రణ్‌వీర్ సింగ్ ‘రా’ (RAW) ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీగా నటించాడు. పాకిస్థాన్‌లోని ప్రమాదకరమైన లియారీ ప్రాంతంలో హంజా అలీ మజారీ అనే మారుపేరుతో అతను చేసే ఆపరేషన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

ఈ ధురందర్ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా రానుంది. ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (Dhurandhar 2) మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఆ సినిమా రిలీజ్‌కు ముందే మొదటి భాగాన్ని ఓటీటీలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయి ఉంటే ఇప్పుడు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతోంది. చూసి ఎంజాయ్ చేసేయండి.