Drishyam 4: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఫ్రాంఛైజీ 'దృశ్యం'. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి మరో మైండ్ బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. 'దృశ్యం 3' థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో నాలుగో భాగం (Drishyam 4) నిర్మించడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు.
దృశ్యం 4 వస్తుంది!

ఇటీవల 'మళవిల్ మనోరమా' నిర్వహించిన ఒక వేడుకలో పాపులర్ మలయాళ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ఈ విషయమై అధికారిక ప్రకటన చేశారు. "దృశ్యం 4 కచ్చితంగా తెరకెక్కుతుంది. మోహన్లాల్ మళ్లీ జార్జ్కుట్టి పాత్రలో అలరిస్తారు. ఇది నా హృదయం లోపలి నుంచి వస్తున్న నిజం" అని ఆంటోనీ స్పష్టం చేశారు.
ఏడు సినిమాలు
ఇటీవల మోహన్లాల్ ఏడుగురు వేర్వేరు దర్శకులతో చేయబోయే ఏడు సినిమాల వివరాలను పంచుకున్నారు. ఆ జాబితాలో 'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్ పేరు కూడా ఉంది. అయితే జీతూ జోసెఫ్తో చేయబోయే సినిమా 'దృశ్యం 4' అవుతుందా లేక కొత్త కథతో రూపొందుతుందా అనే విషయమై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
దృశ్యం 3 ఇలా
'దృశ్యం 3' కథ 'దృశ్యం 2' సంఘటనలు జరిగిన ఐదేళ్ల తర్వాత సాగుతుంది. జార్జ్కుట్టి తన పాత జీవిత కథ ఆధారంగా ఒక విజయవంతమైన సినిమాను నిర్మించి, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కానీ, యామి, రోనీ అనే అధికారులు వరుణ్ మృతి వెనుక ఉన్న అసలు సత్యాన్ని బయటకు తీసేందుకు మళ్లీ విచారణ ప్రారంభిస్తారు.
పాత పగను మనసులో ఉంచుకున్న రాజన్, సహదేవన్, ప్రభాకర్, గీత అంతా కలిసి జార్జ్కుట్టి, ఆయన కుమార్తె అంజులను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా ప్లాన్ వేస్తారు.
అదే కథ
{{/usCountry}}పాత పగను మనసులో ఉంచుకున్న రాజన్, సహదేవన్, ప్రభాకర్, గీత అంతా కలిసి జార్జ్కుట్టి, ఆయన కుమార్తె అంజులను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా ప్లాన్ వేస్తారు.
అదే కథ
{{/usCountry}}అయితే జార్జ్కుట్టి ఆ కుట్రను ఛేదించి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ రంగంలోకి దిగుతాడు. తీవ్రమైన ఒత్తిడి మధ్య తన కుటుంబానికి రక్షణ కల్పించే షరతులతో జార్జ్కుట్టి అధికారులకు లొంగిపోతాడు. కానీ కథ ముగింపులో, అంజును కూడా నేరస్తురాలిగా నిలబెట్టాలని గీత పట్టుబట్టడంతో ఆ కేసు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఆ ఉత్కంఠభరిత క్లైమాక్సే ఇప్పుడు 'దృశ్యం 4' కథకు బలమైన పునాదిగా మారింది.
మోహన్లాల్ కొత్త ప్రాజెక్టులు
ప్రస్తుతం మోహన్లాల్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం 'అతిమనోహరం' 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తోంది.
ఇక సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న 'జైలర్ 2' చిత్రంలో కూడా మోహన్లాల్ ఒక ప్రత్యేక క్యామియో పాత్రలో అలరించనున్నారు.