Etv Jabardasth: తెలుగు బుల్లితెరపై గత దశాబ్ద కాలంగా నవ్వుల పంట పండిస్తూ, రేటింగ్స్లో దూసుకుపోతున్న మల్లెమాల ప్రొడక్షన్స్ ఐకానిక్ కామెడీ షో 'జబర్దస్త్' ఇప్పుడు సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. ఈ షో టెలికాస్ట్ అయ్యే రోజు, టైమ్ పూర్తిగా మారిపోయింది.
వీకెండ్ స్లాట్కు జబర్దస్త్ షిఫ్ట్

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ టీవీలో టెలికాస్ట్ అయ్యే టైమ్ మారింది. మొన్నటి వరకూ శుక్ర, శనివారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కామెడీ షో స్టార్ట్ అయ్యేది. కానీ ఇకపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో స్టార్ట్ కానుంది. జూలై 26 నుంచి కొత్త టైమింగ్ స్టార్ట్ కానుంది. వీకెండ్ స్లాట్ కు జబర్దస్త్ షిప్ట్ అయింది. ఈ అనౌన్స్ మెంట్ ను స్పెషల్ ప్రోమో ద్వారా ఈటీవీ ప్రకటించింది.
అప్పట్లో గురువారం
13 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ జబర్దస్త్ షో మొదట్లో కేవలం గురువారం రాత్రి మాత్రమే వచ్చేది. ఆ తర్వాత క్రేజ్ దృష్ట్యా గురు, శుక్రవారాల్లో ‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’గా రూపాంతరం చెందింది. అనంతరం శుక్ర, శనివారాలకు మారింది.
అయితే ఇటీవల కాలంలో స్టార్ మా, జీ తెలుగు వంటి రైవల్ ఛానల్స్ వీక్ డేస్ (సోమవారం నుంచి శుక్రవారం) రాత్రి వేళల్లో సీరియల్స్తో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. దీనివల్ల వీక్ డేస్ లో నాన్-ఫిక్షన్ కామెడీ షోల రేటింగ్స్ పై ఒత్తిడి పెరుగుతోంది.
సండే ఎందుకంటే?
మరోవైపు ఆదివారం సాయంత్రం అనేది టెలివిజన్ రంగంలో గోల్డెన్ అవర్గా మారుతోంది. ఇప్పటికే ఈటీవీలో వచ్చే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఆదివారం మధ్యాహ్నం మంచి రేటింగ్స్ రాబడుతోంది. ఇప్పుడు అదే జోష్ను సాయంత్రం 6 గంటల స్లాట్కు మార్చడం ద్వారా, ఆదివారం హాలిడే మూడ్లో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ను పూర్తిగా క్యాచ్ చేయవచ్చనేది మల్లెమాల మాస్టర్ ప్లాన్.
హైపర్ ఆది రీ-ఎంట్రీ
{{/usCountry}}మరోవైపు ఆదివారం సాయంత్రం అనేది టెలివిజన్ రంగంలో గోల్డెన్ అవర్గా మారుతోంది. ఇప్పటికే ఈటీవీలో వచ్చే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఆదివారం మధ్యాహ్నం మంచి రేటింగ్స్ రాబడుతోంది. ఇప్పుడు అదే జోష్ను సాయంత్రం 6 గంటల స్లాట్కు మార్చడం ద్వారా, ఆదివారం హాలిడే మూడ్లో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ను పూర్తిగా క్యాచ్ చేయవచ్చనేది మల్లెమాల మాస్టర్ ప్లాన్.
హైపర్ ఆది రీ-ఎంట్రీ
{{/usCountry}}సినిమా బిజీల వల్ల జబర్దస్త్కు కాస్త గ్యాప్ ఇచ్చిన స్టార్ కమెడియన్ హైపర్ ఆది మళ్లీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతున్నాడు. కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ లాగా కాకుండా, సరికొత్త కాన్సెప్ట్లతో సరికొత్త టీమ్ లీడర్లను గైడ్ చేస్తూ ఆది చేసే రచ్చ ఈ సీజన్కు హైలైట్ కానుంది. జడ్జీలుగా మెగా బ్రదర్ నాగబాబు, ఇంద్రజల పాత కాంబినేషన్ కు ఆది పంచ్లు తోడైతే షో పూర్వ వైభవాన్ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హోస్ట్గా రష్మీ గౌతమ్ తన గ్లామర్, యాంకరింగ్తో ఎప్పటిలాగే అలరించనుంది.
కమర్షియల్ అడుగు
ఈ టైమింగ్స్ మార్పు వెనుక కేవలం శాటిలైట్ టీవీ రేటింగ్స్ మాత్రమే లేవు.. డిజిటల్ వ్యూస్ని క్యాప్చర్ చేసే వ్యూహం కూడా ఉంది. ప్రస్తుతం ఈటీవీ విన్ (ETV Win), యూట్యూబ్లలో వీకెండ్స్ లో కంటెంట్ కన్జంప్షన్ 40% వరకు పెరుగుతోంది.
ఆదివారం సాయంత్రం టీవీలో లైవ్ ప్రసారం అయిన వెంటనే, వీకెండ్ నైట్ లేదా సోమవారం ఉదయం ఆఫీసులకు వెళ్లే నెటిజన్లు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో ఈ స్కిట్లను లూప్లో చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 'ఆదివారం షిఫ్ట్' అనేది జబర్దస్త్ బ్రాండ్ను డిజిటల్ ఎరాలో మరింత కాలం నిలబెట్టడానికి వేసిన పక్కా కమర్షియల్ అడుగు అని చెప్పొచ్చు.