...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Promo: గుణ దగ్గర రోహిణి అప్పు, మనోజ్‌కు చెప్పిన రవి, బాలు- మలేషియా తండ్రి గురించి నిలదీసిన భర్త

Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో గుణ దగ్గర అప్పు చేశావా అని రోహిణిని అడుగుతుంది మీనా. వాడితో జాగ్రత్తగా ఉండమని రోహిణికి చెబుతుంది మీనా. గుణ దగ్గర రోహిణి అప్పు చేసిందన్న విషయాన్ని బాలు, రవి చెబుతారు. దాంతో అడుగుతాడు మనోజ్.

Published on: May 19, 2026, 13:58:32 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ కిరణ్ ద్వారా 30 లక్షలు మోసం చేసిన వ్యక్తిని పట్టుకోవాలని బాలు, మీనా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోని కిరణ్‌ను కలిసి మీనా తన ఫ్లవర్ డెకరేషన్ గురించి చెబుతుంది.

మీ వల్ల నాకు గౌరవం లేదు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

కిరణ్ చెల్లి పెళ్లి డెకరేషన్ కోసం చింతామణి, మీనా ఇద్దరు పోటీ పడుతుంటారు. మరోవైపు పోకిరీల నుంచి విద్యను కాపాడబోయి తన చెంపదెబ్బ తింటాడు బాలు ఫ్రెండ్ తమ్ముడు. ఇంకోవైపు మీ వల్ల నామీద ఇంట్లోవాళ్లకు భయం లేకుండా పోయిందని, గౌరవం ఉండట్లేదని మనోజ్, రోహిణిని తిడుతుంది ప్రభావతి.

ఇదివరకు హాల్లో పులిలా కూర్చొనేదాన్ని, మీ వల్ల ఇలా కూర్చొన్నా అని అంటుంది ప్రభావతి. దీనంతటికి కారణం బాలు, మీనా అని చాడీలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంది రోహిణి. ఆ మాటలు మీనా వింటుంది. తర్వాత రోహిణిని పిలుచుకుని మీనా నిలదీస్తుంది. నా వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయా, మీరు చేసే పనుల వల్ల ఇలా జరుగుతుందా అని బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తుంది మీనా.

చూస్తుంటే ఇప్పుడు కూడా ఇంకో సమస్యలో చిక్కుకునేలా ఉన్నావని మీనా అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని రోహిణి అంటుంది. గుణ అనే అతని దగ్గర నువ్వేమైనా అప్పు చేశావా అని మీనా అడుగుతుంది. దానికి రోహిణి షాక్ అయిపోతుంది. పక్కనే శ్రుతి కూడా ఉంటుంది. గుణ గురించి మీకు ఎలా తెలుసు అని రోహిణి అడుగుతుంది.

భయపడిన రోహిణి

మరి అలాంటప్పుడు ఎందుకు అతన్ని రెగ్యులర్‌గా కలుస్తావ్ అని మీనా అడుగుతుంది. దానికి మరింత షాక్ అయిన రోహిణి అతనికి తెలిసిన కస్టమర్స్ చాలా ఉన్నారు. వారికోసమే అతని దగ్గరికి వెళ్తుంటాను అని రోహిణి కవర్ చేస్తుంది రోహిణి. అలాంటివాడితో ఎలాంటి సంబంధం లేకపోవడమే మంచిది, వాడు మనకే రివర్స్ అవుతాడు. మా తమ్ముడిని దొంగతనం చేయమని చెప్పింది వాడే, అందరికి తెలిసేలా చేసింది వాడేనని మీనా అంటుంది.

సరే జాగ్రత్తగా ఉంటానని చెప్పి రోహిణి వెళ్లిపోతుంది. నాకెందుకు రోహిణి అబద్ధం చెబుతుందనిపిస్తుంది, మొన్న కూడా కల్పన వచ్చి చెప్పేవరకు నిజం ఒప్పుకోలేదని శ్రుతి డౌట్ పడుతుంది. తర్వాత రాత్రి ఇంటి డాబాపైన మనోజ్‌తో బాలు, రవి మాట్లాడుతుంటారు. గుణ అనేవాడి దగ్గర వదిన అప్పు చేస్తుందట అని మనోజ్‌తో అంటాడు రవి. రోహిణి ఏంటీ, రౌడీ దగ్గర అప్పు చేయడం ఏంటీ అని మనోజ్ సీరియస్ అవుతాడు.

బాలు చెప్పినట్లు చేసిన మనోజ్

ఇంతకుముందు తనకున్న అప్పుల గురించి నీకు తెలియదా అని బాలు అంటాడు. దాంతో మనోజ్ కోపగించుకుంటాడు. తర్వాత మనోజ్‌ను కూల్ చేసిన బాలు మరి అలాంటి రౌడీ దగ్గరకు పార్లరమ్మా ఎందుకు రోజు వెళ్తుంది. రోజు వాడిని ఎందుకు కలుస్తుందని అంటాడు. ఇంతకుముందు గుణ దగ్గర శివ పనిచేసేవాడు. అక్కడ పార్లరమ్మా రావడం రోజు చూసేవాడట అని బాలు నిజం చెబుతాడు.

పార్లరమ్మా వాళ్లు అసలు కోటీశ్వరులో కాదో నాకు ముందునుంచే అనుమానంగా ఉంది. ఓసారి నువ్వు అది చెక్ చేసుకో అని బాలు అంటాడు. బాలు చెక్ చేసుకోమ్మని చెప్పడంతో వెళ్లి రోహిణిని నిలదీస్తాడు మనోజ్. నిజంగా మీ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యానా. మలేషియాలో మీది పెద్ద ఫ్యామిలీనా. అంటే బిలినీయర్స్ అందరూ మీ చుట్టాలా అక్కడ. నువ్వు ఆ గుణ దగ్గర అప్పు చేశావా అని అన్నింటి గురించి రోహిణిని నిలదీస్తాడు భర్త మనోజ్.

దాంతో రోహిణి షాక్ అయిపోతుంది. ఏం చెప్పాలో తెలియక నీళ్లు మింగుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe