ఇటీవల పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు విజయ్ సొంతూరు అయిన తుమ్మనపేటలో(నాగర్ కర్నూల్ జిల్లా) సందడి చేశారు. సోమవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.

పెళ్లి తర్వాత గ్రామానికి వచ్చిన విజయ్ దేవరకొండ దంపతులకు గ్రామస్తులు కొత్త దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
స్కాలర్ షిప్స్ ప్రకటన
పెళ్లి చేసుకున్న శుభ సందర్భంగా ప్రభుత్వ విద్యార్థులకు దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కాలర్ షిప్స్ ప్రకటించారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేస్తామని వెల్లడించారు.
"మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలమూ ఉన్నాయి. ఇక నుంచి తరుచుగా మన గ్రామానికి వస్తాను. అచ్చం పేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున స్కాలర్ షిప్స్ అందిస్తాం” అని హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు.
మరోవైపు విజయ్-రష్మిక వివాహ విందు (రిసెప్షన్) మార్చి 4న హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు.
{{/usCountry}}మరోవైపు విజయ్-రష్మిక వివాహ విందు (రిసెప్షన్) మార్చి 4న హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు.
{{/usCountry}}భద్రతా కారణాల దృష్ట్యా అతిథుల జాబితాను పరిమితం చేసినట్లు సమాచారం. అభిమానులు వేడుక జరిగే ప్రాంతానికి రావొద్దని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని పోలీసులు, నిర్వహకులు కోరారు.