Heist Movie Based On 950 Cr Louvre Museum Theft: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటైన పారిస్లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం' (Louvre Museum) లో గతేడాది జరిగిన దోపిడీ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియంలోకి చొరబడిన దొంగలు.. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 950 కోట్లకు పైగా) విలువైన పురాతన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ఎంతో క్యాజువల్గా లోపలికి నడుచుకుంటూ వచ్చి

అయితే, ఈ చోరీలో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. దొంగలు ఎంతో క్యాజువల్గా లోపలికి నడుచుకుంటూ వచ్చి, అంతే కూల్గా నగల మూటతో బయటకు వెళ్లడం. హాలీవుడ్ యాక్షన్ సినిమాలను తలపించేలా సాగిన ఈ రియల్ లైఫ్ రాబరీ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఏఎఫ్పీ' (AFP) మంగళవారం (మే 26) ఒక కథనాన్ని ప్రచురించింది.
తెరకెక్కించనున్న స్టార్ డైరెక్టర్
గతేడాది అక్టోబర్ 19, 2025న జరిగిన ఈ భారీ దొంగతనం నేపథ్యంలో ఫ్రెంచ్ జర్నలిస్టులు రాసిన 'మేయిన్ బస్సే సుర్ లే లౌవ్రే' (Main basse sur le Louvre) అనే పరిశోధనాత్మక పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతేడాది హాలీవుడ్ నటి అన్యా టేలర్-జాయ్ ప్రధాన పాత్రలో 'సాక్రిఫైస్' (Sacrifice) వంటి భారీ హిట్ను అందించిన ఫ్రెంచ్ దర్శకుడు రొమైన్ గవ్రాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ పుస్తకం మార్కెట్లోకి విడుదల కాకముందే దీని సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఐకనోక్లాస్ట్' దక్కించుకోవడం విశేషం. అంతేకాదు, ఒక బ్రిటీష్ ప్రొడక్షన్ సంస్థ ఈ కథ ఆధారంగా ఒక డాక్యుమెంటరీ సిరీస్ను కూడా నిర్మించడానికి హక్కులను సొంతం చేసుకుంది. ప్రముఖ ఫ్రెంచ్ పత్రికలు 'లే పారిసియన్', 'లే మోండే'తో పాటు 'పారిస్ మ్యాచ్' మ్యాగజైన్కు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు ఈ పుస్తకాన్ని రాశారు.
అసలు లౌవ్రే మ్యూజియంలో ఏం జరిగింది?
గతేడాది అక్టోబర్ 19న కొందరు దొంగలు మ్యూజియం మెయింటెనెన్స్ కార్మికుల వేషధారణలో లోపలికి ప్రవేశించారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సెక్యూరిటీ సిస్టమ్ను బురిడీ కొట్టించి వందల కోట్ల విలువైన నగలని మాయం చేశారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
{{/usCountry}}గతేడాది అక్టోబర్ 19న కొందరు దొంగలు మ్యూజియం మెయింటెనెన్స్ కార్మికుల వేషధారణలో లోపలికి ప్రవేశించారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సెక్యూరిటీ సిస్టమ్ను బురిడీ కొట్టించి వందల కోట్ల విలువైన నగలని మాయం చేశారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
{{/usCountry}}భద్రతా లోపాల కారణంగా లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ లారెన్స్ డెస్ కార్స్ తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ కేసును ఏడు నెలలుగా విచారిస్తున్న అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు.. కీలక అనుమానితులను అరెస్ట్ చేసినప్పటికీ, ఆ దొంగిలించబడిన రూ. 950 కోట్ల విలువైన నగలు ఎక్కడున్నాయనేది మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
ఇంకా ఫిక్స్ కానీ టైటిల్
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు. అలాగే ఇందులో నటించబోయే నటీనటుల వివరాలను ఈ ఏడాది చివర్లో అధికారికంగా ప్రకటించనున్నారు. క్రైమ్ అండర్ వరల్డ్కు కళాఖండాల దొంగతనం అనేది ఒక కొత్త కాసుల వర్షం కురిపించే వ్యాపారంగా మారిందని, ఈ సినిమా ద్వారా ఆ చీకటి కోణాలను ప్రపంచానికి చూపించనున్నామని చిత్ర బృందం తెలిపింది.