Huma Qureshi: శృంగారభరితంగా చూపిస్తేనే హంతకురాలా.. సినీ ఇండస్ట్రీపై హీరోయిన్ హుమా ఖురేషి ఆగ్రహం!
Huma Qureshi On Hyper Sexulaized Action Heroines: బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి నటించి, నిర్మించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' జూలై 3న థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాల్లో లేడీ యాక్షన్ స్టార్లను గ్లామరస్గా, శృంగారభరితంగా చూపించే పితృస్వామ్య ధోరణిపై ఘాటుగా స్పందించారు.
Huma Qureshi On Hyper Sexulaized Action Heroines: హిందీ చిత్రసీమలో సంప్రదాయ కథానాయిక పాత్రల రొటీన్ ఫార్మాట్ను బ్రేక్ చేయడంలో నటి హుమా ఖురేషి ఎప్పుడూ ముందుంటారు. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, ఓటీటీ స్క్రీన్పై సంచలనం సృష్టించిన 'మహారాణి' వెబ్ సిరీస్ వరకు ఆమె ఎంచుకున్న వైవిధ్యమైన పాత్రలే ఇందుకు నిదర్శనం.

బధిర కిరాయి హంతకురాలిగా
తాజాగా హుమా ఖురేషి లీడ్ రోల్లో నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do) జూలై 3న విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె ఒక మూగ, బధిర కిరాయి హంతకురాలిగా నటించి మెప్పించారు. ఈ సినిమా ద్వారా ఒక లేడీ యాక్షన్ స్టార్ అంటే కేవలం గ్లామరస్గా, నాజూగ్గా మాత్రమే ఉండాలనే అపోహను ఆమె తిప్పికొట్టారు.
ఆ పాత్రలు పితృస్వామ్య ఆలోచనల నుంచే వస్తున్నాయి!
బేబీ డూ డై డూ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హుమా ఖురేషి బాలీవుడ్ మేకింగ్ స్టైల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో, అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా హిందీ సినిమాల్లో లేడీ అసాసిన్స్ లేదా యాక్షన్ హీరోయిన్లను కేవలం 'ఫెమ్ ఫాటాలే' (Femme Fatale) లాగా, అంటే యాక్షన్తో పాటు విపరీతమైన గ్లామర్ను జోడించి చూపిస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదొక మహిళా ద్వేషపూరితమైన, సంకుచితమైన ఆలోచన అని కొట్టిపారేశారు. "మహిళలు కిరాయి హంతకులుగా కనిపించాలంటే గట్టిగా అతుక్కుపోయే బిగుతు దుస్తులు వేసుకోవాలి, వారిని శృంగారభరితంగానే చూపించాలనే ఈ ధోరణి పితృస్వామ్య వ్యవస్థ నుంచి పుట్టిందే" అని హుమా ఖురేషి అన్నారు.
సినిమాల్లో మహిళలకు మరింత మెరుగైన, వైవిధ్యమైన పాత్రలు రాయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తమ సినిమా ఒక మంచి అడుగు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై లోకల్ రైల్లో ప్రయాణించే ఒక సాధారణ మహిళ లాగే ఈ సినిమాలో తన 'బేబీ' పాత్ర ఉంటుందని, అంత సాధారణంగా ఉంటూనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే కిల్లర్గా అలరిస్తుందని చెప్పారు.
వైకల్యం బలహీనత కాదు.. ఒక ఆయుధం
సాధారణంగా సమాజంలో వికలాంగులను, అందులోనూ శారీరక లోపాలున్న మహిళలను బలహీనులుగా చూస్తుంటారని హుమా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఈ సినిమాలో కథను పూర్తిగా భిన్నంగా చూపించినట్లు చెప్పారు.
"ఈ చిత్రంలోని హీరోయిన్ మాట్లాడలేదు, వినలేదు. కానీ, ఆమె ఒక ప్రమాదకరమైన హంతకురాలు, వినాశనానికి మరో రూపం. ఇక్కడ ఆమెకున్న శారీరక లోపం బలహీనత కాదు, అదే ఆమెకు అతి పెద్ద బలం" అని హుమా ఖురేషి చెప్పుకొచ్చారు.
నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ 'బేబీ డూ డై డూ' చిత్రాన్ని హుమా ఖురేషి, ఆమె సోదరుడు సాకిబ్ సలీమ్ కలిసి తమ సొంత బ్యానర్ 'సలీమ్ సిబ్లింగ్స్' పై నిర్మించారు. ఈ సినిమాలో సికిందర్ ఖేర్, చుంకీ పాండే, సీమా పహ్వా, రచిత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.
'టాక్సిక్'తో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
ఈ సినిమా తర్వాత హుమా ఖురేషి ఒక భారీ కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic). ఈ సినిమాలో హుమా ఖురేషి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
కేజీఎఫ్ క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్లో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. టాక్సిక్ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో హుమా క్రేజ్ సౌత్ ఇండియాలో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


