...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 5 ఎపిసోడ్: కోర్టుకు ధీరజ్- రామరాజుపైనా నేరారోపణ- కావాలనే ఇరికించారన్న లాయర్- ప్రేమ మిస్సింగ్

Illu Illalu Pillalu Serial June 5th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 5వ ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌కు రామరాజు ఫ్యామిలీ వెళ్తుంది. వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. లాయర్ వచ్చి స్టేషన్ బెయిల్ అడిగితే కోర్టులో చూసుకోమ్మని ఎస్సై చెబుతాడు. ధీరజ్‌ను ప్లాన్ ప్రకారం ఇరికించారని లాయర్ చెబుతాడు.

Published on: Jun 5, 2026, 08:45:35 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో డ్రగ్స్ కేసులో ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు రామరాజు ఇంట్లో చెబుతుంది నర్మద. దాంతో సాగర్ చప్పట్లు కొడతాడు. ఇందాక ఎవరో పెద్దమనిషి నాకు గీతోపదేశం చేశారు. వాడిలా నన్ను ఎదగమన్నారు. ఇలానేనా అని తండ్రిపై వెటకారంగా మాట్లాడుతాడు సాగర్.

ముగ్గురు కొడుకులను వేరు వేరుగా

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 5వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 5వ ఎపిసోడ్

వేదవతి తిడుతుంది. చిన్నోడు అరెస్ట్ అయినందుకు బాధగానే ఉంది. కానీ ఈ మనిషి ముగ్గురు కొడుకులను వేరు వేరు దృష్టితో చూస్తున్నాడు చూడు ఆ పెద్ద మనిషికి చెబుతున్నాను. ఆరోజు నేను జాబ్ కొనుక్కుంటే రక్తపు కూడు తింటున్నా అన్నారుగా. మరి చిన్నోడిని ఏమని అంటాడు ఈ పెద్ద మనిషి అని సాగర్ అంటాడు.

వాడు నీలా దొంగ కాదు. వాడితో పోల్చుకోకు. వాడు ప్రాణం పోయిన తప్పు చేయడు. ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది అని రామరాజు అంటాడు. పోలీస్ స్టేషన్‌కు రామరాజు, వేదవతి, నర్మద వెళ్తారు. అదంతా చూసిన వల్లితో సుకన్య నీకు ఇది గుడ్ న్యూస్. ఈ బాధలో వారు నీ కడుపు మీద ఫోకస్ పెట్టరని అంటుంది. లాకప్‌లో దెబ్బలతో ఉన్న ధీరజ్‌ను చూసి వేదవతి ఏడుస్తుంది.

రామరాజు ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. అసలు నిన్ను అరెస్ట్ చేయడం ఏంట్రా అని అడిగితే.. తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిన నిజం చెబుతాడు ధీరజ్. నువ్వు నాకు వచ్చి నిరూపించుకోవాల్సిన అవసరం లేదురా అని రామరాజు అంటాడు. ఎస్సై వచ్చి అందరిని ఏంటీ న్యూసెన్స్. నీ కొడుకు డ్రైవర్ ముసుగులో ఉన్న స్మగ్లర్ అని అంటాడు.

నీ ఆధ్వర్యంలోనే సప్లై

ఎస్సై చెప్పడంతో రామరాజు ఫ్యామిలీని పోలీసులు బయటకు లాక్కెళ్తారు. కోర్టుకు వెళ్తే చిన్నోడి జీవితానికి పెద్ద మచ్చ అవుతుందని, వాడిని బయటకు తీసుకొచ్చేందుకు ఏదోటి చేయమని వేదవతి ఏడుస్తుంది. లాయర్‌తో మాట్లాడానని రామరాజు అంటుండగా లాయర్ వస్తాడు. ఎస్సైతో లాయర్ మాట్లాడుతాడు. ఎస్సై జరిగింది చెబుతాడు.

లాయర్ స్టేషన్ బెయిల్ అడుగుతాడు. దీనికి అసలు కోర్టులో బెయిల్ వస్తుందా. టైమ్ వేస్ట్ చేయకుండా వెళ్లండి సర్ అని ఎస్సై అంటాడు. దాంతో ధీరజ్ దగ్గరికి వెళ్లి కోర్టులో బెయిల్‌కు ట్రై చేద్దాం. నువ్వేం కంగారుపడకు అని లాయర్ అంటాడు. ఎంత చెప్పిన ఎస్సై వినట్లేదు. కోర్టులోనే బెయిల్ తెచ్చుకోమంటున్నారు, ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని అని లాయర్ అంటాడు.

దగ్గరివాల్లే కావాలని ఇరికించారు

అక్కడ జరిగింది ప్రేమ చెబుతుంది. అన్యాయంగా ఇరుక్కున్నాడు అని నర్మద చెబుతుంది. ఇరుక్కోవడం కాదు కావాలనే ఎవరో ఇరికించారు అని లాయర్ అంటాడు. మీ అబ్బాయి కారులో వెళ్లడం అక్కడే బుట్టలతో స్మగ్లర్ ఉండటం. అదే దారిలో పోలీసులు ఉండటం అంతా ప్లాన్‌లా ఉంది. ఆ రూట్‌లో ఎన్నో ఆటోలు వెళ్తాయి. కానీ, వాడు మీ అబ్బాయి కారు వచ్చేదాక ఆగాడు అని లాయర్ అంటాడు.

బుట్టలో మామిడి కాయల అడుగున మాదకద్రవ్యాలు పెట్టారు. వాడు అక్కడి నుంచి పారిపోతుంటే పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. దృష్టి అంతా ధీరజ్ పైనే పెట్టారు. అంటే ఇది ధీరజ్‌ను ఇరికించేందుకు వేసిన పక్కా ప్లాన్. అందులో ఏ డౌట్ లేదని లాయర్ అంటాడు.

ఇదంతా ఎవరికి అవసరం ఉందని ప్రేమ అంటుంది. కనిపించని శత్రువులు ఉండొచ్చుగా. పగ తీర్చుకునేందుకు చేసి ఉండొచ్చు కదా. కానీ, పక్కాగా చెబుతున్నా ఇదంతా ఎవరో బాగా తెలిసిన వాళ్లే చేశారు అని లాయర్ అంటాడు. మా అబ్బాయిని ఎలాగైనా బయటకు తీసుకురండి అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కోర్టు నుంచి బెయిల్ తీసుకురావడం తప్పా ఏం చేయలేం. నా ప్రయత్నం నేను చేస్తానని, రేపు కోర్టులో కలుద్దామని లాయర్ వెళ్లిపోతాడు.

భాగ్యం ఫ్యామిలీ ఇమిటేషన్స్

ప్రేమ ఎక్కడ కనిపించదు. మరోవైపు భాగ్యం దగ్గర ధీరజ్ అరెస్ట్ అయింది సుకన్య, శ్రీవల్లి చెబుతారు. ధీరజ్ అరెస్ట్ అయితే వేదవతి ఎలా డ్రామా చేస్తుందో భాగ్యం అలాగే ఇమిటేట్ చేస్తుంది. రామరాజులా ఇడ్లీ బాబాయ్ నాటకం వేస్తాడు. పెద రాయుడు లెవెల్‌లో ఇడ్లీ బాబాయ్ డైలాగ్స్ చెబుతాడు. ఎస్సైగా భాగ్యం ఇమిటేట్ చేస్తుంది.

ఇడ్లీ బాబాయ్ యాక్టింగ్‌కు అంతా చప్పట్లు కొడతారు. పెద్దపులి వేషం పిల్లి పిల్ల వేసినట్లు ఉందని భాగ్యం అంటుంది. ఇప్పుడు మన ప్రేమ పావురం అని సుకన్య అంటే.. ప్రేమలా శ్రీవల్లి చేస్తుంది. అచ్చం ప్రేమలాగే డైలాగ్స్ చెబుతుంది శ్రీవల్లి. సుకన్యను పట్టుకుని ఏడుస్తున్నట్లు వల్లి యాక్టింగ్ చేస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe