బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి జాన్వీ కపూర్ ఇటీవల మద్యం వ్యసనం (Alcohol Addiction), దాని చుట్టూ ఉన్న సామాజిక అపోహలపై మాట్లాడింది. సమాజంలో మద్యాన్ని ఒక సాధారణ అలవాటుగా చూస్తున్నారని, అయితే అది ఎప్పుడు క్లినికల్ సమస్యగా మారుతుందో గుర్తించడంలో ప్రజలు విఫలమవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఆఫ్ ది రాక్స్' (Off The Rocks) అనే అవగాహన కార్యక్రమ ప్రారంభోత్సవంలో జాన్వీ కపూర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిశ్శబ్దం వద్దు.. నిందలు అంతకన్నా వద్దు!

మద్యం అలవాటు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సమాజం రెండు రకాలుగా స్పందిస్తుందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. "మద్యం గురించి చర్చ అసలు ఉండదు, ఒకవేళ ఉన్నా అది ఎదుటివారిని తక్కువ చేసి చూపేలా (Judgmental) ఉంటుంది. ఈ రెండు పద్ధతులు కూడా వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారికి ఏమాత్రం సాయపడవు" అని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.
మద్యం వ్యసనం అనేది ఒక వాస్తవం అని, అది అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపుతుందని జాన్వీ కపూర్ వివరించారు. "మద్యానికి బానిసవ్వడం అనేది నైతిక విలువలు లేకపోవడం కాదు. అది ఒక అనారోగ్యం, చికిత్స అవసరమైన మానసిక ఆరోగ్య సమస్య. దీనిపై అవగాహన పెంచడమే మా ఈ ప్రయత్నం" అని జాన్వీ కపూర్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జాన్వీ కపూర్ 'అమహా' (Amaha) అనే మానసిక ఆరోగ్య సంస్థతో చేతులు కలిపారు.
వరుస సినిమాలతో బిజీబిజీ..
ఇదిలా ఉంటే, వృత్తిపరంగా చూస్తే, జాన్వీ కపూర్ ఇటీవల వరుణ్ ధావన్తో కలిసి 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సుమారు రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ఓటీటీ ట్రెండింగ్లో కూడా ఈ మూవీ ఉంటోంది.
పెద్ది సినిమాతో మరోసారి
ఇంతేకాకుండా జాన్వీ కపూర్ మరోసారి తెలుగులో నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' (Peddi) చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
{{/usCountry}}ఇంతేకాకుండా జాన్వీ కపూర్ మరోసారి తెలుగులో నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' (Peddi) చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
{{/usCountry}}