ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధ జ్వాలల మధ్య అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారతీయ రిఫైనరీలకు అమెరికా కేవలం 30 రోజుల పాటు మాత్రమే 'తాత్కాలిక' మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
మక్కల్ నీది మయ్యమ్ అధినేత

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును ఎండగడుతూ యూనివర్సల్ స్టార్ (లోక నాయకుడు), మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఒక బహిరంగ లేఖ రాశారు.
కమల్ హాసన్ కామెంట్స్
శనివారం (మార్చి 7) సాయంత్రం తన సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి కమల్ హాసన్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కమల్ హాసన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆదేశాలు పాటించే రోజులు పోయాయి
"గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు.. భారతీయులమైన మేము ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశానికి చెందిన వారం. సుదూర తీరాల (విదేశాల) నుంచి వచ్చే ఆదేశాలను పాటించే రోజులు ఎప్పుడో పోయాయి. దయచేసి మీ పని మీరు చూసుకోండి" అని కమల్ హాసన్ రాసుకొచ్చారు.
"రెండు సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది. మీ దేశానికి, ప్రజలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ కమల్ హాసన్ అత్యంత కటువుగా స్పందించారు. ఒక గర్వించదగ్గ భారత పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు కమల్ హాసన్ పేర్కొన్నారు.
అసలు వివాదం ఏమిటి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియా మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు జరిగే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటంతో ముడి చమురు కొరత ఏర్పడింది.
{{/usCountry}}ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియా మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు జరిగే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటంతో ముడి చమురు కొరత ఏర్పడింది.
{{/usCountry}}ఈ తరుణంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పందిస్తూ.. రష్యా నుంచి భారత్ చమురు కొనడానికి 30 రోజుల తాత్కాలిక గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత్ ఇకపై రష్యాను వదిలి అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్ వైఖరిపై సందిగ్ధత
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని అమెరికా చెబుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా మాత్రం భారత్ తమతో వ్యాపారాన్ని తగ్గించుకుంటుందన్న వార్తలను కొట్టిపారేసింది.
హాట్ టాపిక్గా కమల్ లేఖ
"రష్యా నుంచి చమురు కొనడం వల్ల రెండు దేశాలకూ లాభమే. పైగా ఇది అంతర్జాతీయ ఇంధన మార్కెట్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది" అని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో అమెరికా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.