Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్, మండి లోక్సభ నియోజకవర్గం ఎంపీ కంగాన రనౌత్ (Kangana Ranaut) ఎప్పుడూ తన బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జెన్ జెడ్ (Gen Z) నిరసనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెను విమర్శించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్పై కంగనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
28 ఏళ్లకే నాకు 2 జాతీయ అవార్డులు

తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సౌరవ్ దాస్ వీడియోను రీపోస్ట్ చేస్తూ కంగనా రనౌత్ సంచలన కామెంట్లు చేశారు. "నేను ఈ వ్యక్తి గురించి గూగుల్ చేసి చూశా. అతనికి 28 ఏళ్లు. ఇప్పటికీ స్టూడెంట్ ను అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు!
నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు, కానీ గత 20 ఏళ్లుగా ప్రజల మధ్యే జీవిస్తున్నాను. అతడి వయస్సు (28 ఏళ్లు) నాకున్నప్పుడు, నా చేతిలో అప్పటికే 2 నేషనల్ అవార్డులున్నాయి’’ అని కంగనా రాసుకొచ్చింది.
నువ్వో యూజ్లెస్
తాను కొత్తగా ఎంపీ అయినందున, ఆ పనిభారం చూసి ప్రారంభంలో కాస్త ఒత్తిడికి గురైన మాట నిజమేనని కంగనా అంగీకరించారు. "కొత్తగా ఎంపీ అయినప్పుడు ఒత్తిడికి గురయ్యా. ఎందుకంటే నేను కేవలం ఎంపీ మాత్రమే కాదు.. ఫిలింమేకర్, పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, బిజినెస్ ఉమెన్.
ఇన్ని రంగాల్లో నిరంతరం డిమాండ్ ఉన్న వ్యక్తి భావనలు.. ఏ పనిపాటా లేని యూజ్లెస్, నిరుద్యోగి అయిన నీలాంటి వ్యక్తికి ఎలా అర్థమవుతాయి? డియర్ సౌరవ్.. ముందు ఏదైనా ఒక నైపుణ్యం (Skill) నేర్చుకో" అంటూ తీవ్రస్థాయిలో కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివాదానికి కారణమేంటి?
అసలు ఈ వివాదం జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్ జెడ్ యువత చేపట్టిన నిరసనలతో ప్రారంభమైంది. జులై 20న జరిగిన 'చలో సంసద్' మార్చ్ తర్వాత నిరసనకారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలపై కంగనా అత్యంత ఘాటుగా స్పందించింది.
{{/usCountry}}అసలు ఈ వివాదం జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్ జెడ్ యువత చేపట్టిన నిరసనలతో ప్రారంభమైంది. జులై 20న జరిగిన 'చలో సంసద్' మార్చ్ తర్వాత నిరసనకారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలపై కంగనా అత్యంత ఘాటుగా స్పందించింది.
{{/usCountry}}‘‘ఆ రీల్స్ చూస్తుంటే వాంతి వచ్చేలా ఉంది. వాళ్లు ఉపయోగించే భాష అసహ్యకరంగా ఉంది. వారి ప్రవర్తన 'కాక్రోచ్' (బొద్దింకల) తరహాలో ఉంది’’ అని కంగనా ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
సౌరవ్ దాస్ ఏమన్నాడంటే?
కంగనా వ్యాఖ్యలపై వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) తో మాట్లాడిన సౌరవ్ దాస్.. "కనీసం సొంత పార్టీ నాయకులే కంగనా మాటలను సీరియస్గా తీసుకోరు. ఆమె వ్యాఖ్యలను నేటి తరం జెన్ జెడ్ ఎందుకు పట్టించుకుంటుంది? ఎంపీ పనంటే తక్కువ అనుకున్నానని, ఇంత పని ఉంటుందని ఊహించలేదని ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలే ఆమె సీరియస్నెస్ను తెలియజేస్తున్నాయి" అని విమర్శించారు.