కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న సారీ చెప్పి కావేరి కాళ్లకు పసుపు రాస్తుంది. మిగతా వాళ్లకు కూడా రాయు అని సుమిత్ర అంటే.. నేను రాస్తాను అని దీప తీసుకుంటుంది. జ్యోత్స్న అంతా బాగానే చేసింది కానీ ఈ కార్తీక్ గాడు వచ్చి అంతా చెడగొట్టాడు అని పారిజాతం మనసులో అనుకుంటుంది. కాంచన కాళ్లకు పసుపు రాస్తుంది.
భర్తను క్షమించలేవా

అది చూసి సుమిత్ర, దీప మురిసిపోతారు. కార్తీక్ సంతోషిస్తాడు. సుమిత్ర కాళ్లకు కూడా దీప పసుపు రాస్తుంది. ఎమోషనల్ అవుతుంది. కాంచనతో శ్రీధర్ గురించి శివ నారాయణ మాట్లాడుతాడు. ఆ మాటలు శ్రీధర్ వింటుంటాడు. శ్రీధర్ వింటుంది కార్తీక్ చూస్తాడు. శ్రీధర్ విషయంలో మార్పు చూసి అవమానించిన నేనే అధికారం ఇచ్చాను. నిన్ను ఒకటి అడగాలి. నీ భర్తను క్షమించలేవా అని శివనారాయణ అంటాడు.
నేను శ్రీధర్ను సీఈఓ చేయడానికి ఒక కారణం కార్తీక్ అయితే మరోటి నువ్వు. నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నాకోసం అయినా నీ భర్తను క్షమించలేవా. నాకోసం నీ భర్తను క్షమించాలమ్మా అని కాంచన చేయి పట్టుకుని మరి శివ నారాయణ అడుగుతాడు. క్షమిస్తాను నాన్న. నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి క్షమిస్తాను. కానీ, భర్తగా మాత్రం దగ్గరికి తీసుకోలేను అని కాంచన అంటుంది.
అల్లుడు మోసం చేయడానికి, భర్త మోసం చేయడానికి చాలా తేడా ఉంది. నా భర్తను దైవంలా చూశాను. నువ్వు క్షమించినంత సులభంగా నేను క్షమించలేను. క్షమించినా భర్తగా తీసుకోలేను. కావేరికి నా భర్తను ఇచ్చేశాను. నేను ఎప్పుడు ఆయన్ను క్షమించి భర్తగా తీసుకుంటానో తెలుసా అని కాంచన చెబుతుంటే దాసు వస్తాడు. దాంతో అంతా దాసును ఆహ్వానిస్తారు.
శ్రీధర్ డౌట్
శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. హాయ్ మావయ్య అంటూ శ్రీధర్ వెనుక నుంచి కార్తీక్ వెళ్తాడు. అది చూసి వీడెప్పుడు వచ్చాడు. అంతా విన్నాడా అని డౌట్ పడతాడు శ్రీధర్. దాసు రావడం ఆలస్యం అయుంటే కాంచన మనసులో ఉన్న మాట చెప్పేది అని శివ నారాయణ, శ్రీధర్ ఒకేలా ఆలోచిస్తారు. కిందకు వచ్చిన జ్యోత్స్న దాసును చూసి షాక్ అవుతుంది. ఇంతలో పంతులు వస్తాడు.
{{/usCountry}}శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. హాయ్ మావయ్య అంటూ శ్రీధర్ వెనుక నుంచి కార్తీక్ వెళ్తాడు. అది చూసి వీడెప్పుడు వచ్చాడు. అంతా విన్నాడా అని డౌట్ పడతాడు శ్రీధర్. దాసు రావడం ఆలస్యం అయుంటే కాంచన మనసులో ఉన్న మాట చెప్పేది అని శివ నారాయణ, శ్రీధర్ ఒకేలా ఆలోచిస్తారు. కిందకు వచ్చిన జ్యోత్స్న దాసును చూసి షాక్ అవుతుంది. ఇంతలో పంతులు వస్తాడు.
{{/usCountry}}ఇంకా ఈ ఇంటి వారసురాలి కోసం వెతుకుతున్నావా అని దాసుతో పారు అంటే అవును అనుకో అంటాడు. రేయ్ నీ కూతురుకి ద్రోహం చేస్తున్నావు అని పారు అంటే.. అది నువ్వు ఎప్పుడో చేశావ్ అని దాసు అంటాడు. ఇంట్లో హోమం జరిపిస్తారు పంతులు. కాశీ, స్వప్నను కార్తీక్ గమనించి గొడవ జరిగిందనుకుంటాడు.
పూర్ణాహుతిని పట్టుకుని ఇంటి వారసురాలితో కలిసి చుట్టూ తిరిగి హోమంలో వేయాలి. మీ చేతి నుంచి పూర్ణాహుతి హోమంలోనే పడాలి. అలా కాకుండా కింద పడితే వచ్చే విపత్తను ఎవరు అడ్డుకోలేరు. ఏం భయంలేదు. ఇష్ట దైవాన్ని స్మరించుకోని వేయండి అని పంతులు చెబుతాడు. ఇంటి వారసులు దీప. జ్యోత్స్నతో వేయిస్తే అరిష్టం. తెలిసి కూడా ఏం చేయకుంటే ఎలా అని దాసు ఆలోచిస్తాడు.
కార్తీక్ మాట కోసం
జ్యోత్స్నకు వద్దని దాసు సైగ చేస్తే పట్టించుకోదు. పారిజాతం వచ్చి దాసును పక్కకు తీసుకెళ్లి జ్యోత్స్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నావ్. ఎవరికైనా ఏమైనా కానీ నీ కూతురుకు ఏం కాదుగా అని పారు అంటుంది. జరగాల్సిన అరిష్టం ఆపుతాను అని దాసు అంటాడు. దాసుతో పారు మాట్లాడటం కార్తీక్ చూస్తాడు. కార్తీక్కు మాట ఇవ్వకుంటే దీప వారసురాలని చెప్పేవాన్ని అని దాసు అనుకుంటాడు.
అన్నయ్య కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే చూస్తు ఉండలేను. నిజం బయటపడే సమయం వచ్చినట్లుందేమో. జ్యోత్స్న నా కూతురు అని అందరికి చెప్పేస్తాను అని ఇంట్లోకి వస్తాడు దాసు. సుమిత్ర కళ్లు తిరుగుతుంటే దీప పట్టుకుంటుంది. అది చూసి దాసు ఆగుతాడు. మీకేం కాదు మీకు సాయంగా ఉంటాను అని దీప అంటుంది. జ్యోత్స్న అరిస్తే శివ నారాయణ అంటాడు.
కర్మ సిద్ధాంతం బాగా పనిచేస్తుంది. కన్నతల్లికి కన్న కూతురు సాయం చేస్తుంది. కానీ, నా ముందు ఏ సిద్ధాంతం పనిచేయదు అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంటి వారసురాలే సుమిత్రకు సహాయంగా ఉండేలా దేవుడు చేశాడని దాసు అనుకుంటాడు. పూర్ణాహుతిని హోమంలో వేయమని పంతులు చెబుతాడు.
దీపతోనే హోమం పూర్తి
దాంతో సుమిత్ర, దశరథ్, దీప పూర్ణాహుతిని జ్యోత్స్న చేతులో వేస్తుంటారు. పక్కకు జ్యోత్స్న చూస్తూ కింద పడేస్తుంది. కానీ, దీప తన చేతులతో పూర్ణాహుతి హోమంలోనే పడేలా చేస్తుంది. అదంతా చూసి అంతా షాక్ అవుతారు.
జ్యోత్స్న, పారు ప్లాన్ అట్టర్ ప్లాప్ అవుతుంది. వారసురాలి చేత్తోనే పూర్ణాహుతి పడిందని దాసు, కార్తీక్ సంతోషిస్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.