ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్- టాప్ 2లో ట్రెండింగ్- రేటింగ్ చెత్తగా, రెస్పాన్స్ మాత్రం హిట్గా!
ఓటీటీలో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్లో దూసుకుపోతోంది. టాప్ 2 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్లో ఉన్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే, ఐఎమ్డీబీ నుంచి చెత్త రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్గా నిలుస్తోంది. మరి ఆ మూవీ ఏంటీ, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమా ఓటీటీకి వచ్చాక యావరేజ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కానీ, థియేటర్లలో ఫ్లాప్గా నిలిచిన సినిమాలు మాత్రం ఓటీటీలో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటాయి.

థియేటర్లలో ఫ్లాప్ టాక్
ఇలా థియేటరల్లో ఫ్లాప్గా.. ఓటీటీల్లో హిట్గా నిలిచే సినిమాలే ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి ఓ తెలుగు క్రైమ్ కామెడీ మూవీనే ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఆ సినిమా మరేదే కాదు మిత్ర మండలి.
ప్రియదర్శి-నిహారిక ఎన్ఎమ్
నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో బీవీ వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్స్పై విజయేందర్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మిత్ర మండలి'. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ హీరో హీరోయిన్లుగా జంటగా నటిస్తూ వెండి తెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
మిత్ర మండలి నటీనటులు
కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన మిత్ర మండలి సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతాన్ని అందించారు. సిద్ధార్థ సినిమాటోగ్రఫీ వర్క్ చూసుకున్నారు. హీరో హీరోయిన్లతోపాటు మిత్ర మండలి సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఐఎమ్డీబీ రేటింగ్
ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదలైన మిత్ర మండలి సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే, ఐఎమ్డీబీ నుంచి పదికి కేవలం 4.2 రేటింగ్ తెచ్చుకుంది. అంటే బిలో యావరేజ్గా ఈ సినిమా నిలిచింది.
టాప్ 2 ట్రెండింగ్లో
ఇలా చెత్త రేటింగ్ తెచ్చుకున్న మిత్ర మండలి ఓటీటీలో మాత్రం హిట్ టాక్తో దూసుకుపోతోంది. నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్లో మిత్ర మండలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్లో టాప్ #2 ట్రెండింగ్లో నిలిచింది మిత్ర మండలి సినిమా.
కాంతార సినిమాకు పోటీగా
ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో టాప్ #1 ట్రెండింగ్లో ఉన్న కాంతార చిత్రానికి పోటీగా నిలుస్తూ మరింత వేగంగా ప్రేక్షకులను అలరిస్తూ మిత్ర మండలి దూసుకు వెళ్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. చెత్త రేటింగ్ తెచ్చుకున్న మిత్ర మండలి ఓటీటీ ట్రెండింగ్లో హిట్తో దూసుకుపోవడం విశేషంగా మారింది.
నలుగురు మిత్రుల మధ్య
ఇకపోతే మిత్ర మండలి సినిమాలో ఒక పట్టణంలోని నలుగురు మిత్రుల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలను సహజంగా చూపించారు. వారి మధ్య జరిగే సన్నివేశాలను, సందర్భాలను పూర్తి స్థాయిలో వినోదభరితంగా ఉందని కామెంట్స్ వినిపించాయి.
మేకర్స్ కామెంట్స్
మంచి విజువల్స్తో ఉన్నతమైన నిర్మాణ విలువలతో పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా మిత్ర మండలి చిత్రం అన్ని జోనర్ల ప్రేక్షకులను అలరిస్తోందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


