కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 12 ఎపిసోడ్ లో.. మరో హాస్పిటల్లో దీపకు టెస్టులు చేయిస్తారు. అన్ని టెస్టులు చేశానని, రిపోర్ట్స్ రాగానే పంపిస్తానని డాక్టర్ చెప్తుంది. నా ఫోన్ నంబర్ కు పంపించమని జ్యోత్స్న చెప్తుంది. హాస్పిటల్ కు వెళ్దామని దీపతో కార్తీక్ అంటాడు. రిపోర్ట్స్ వచ్చేంతవరకూ అందరం ఇంట్లోనే ఉందామని జ్యోత్స్న, శివనారాయణ చెప్తారు.
కోడలు కాదు మేనకోడలు

స్వప్న దగ్గరకు దాసు వస్తాడు. నేను కోడలి కోసం వచ్చానని దాసు అంటాడు. మామయ్య నేను మేనకోడలు అవుతా, అలాగే పిలవమని స్వప్న అంటుంది. స్వప్నకు దాసు ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమంటాడు. స్వప్న పాపిట్లో కూడా బొట్టు పెట్టుకుంటుంది. ఒక్క క్షణం ఆగిపోయి ఆలోచిస్తుంది. నువ్వేం తప్పు చేయలేదమ్మా, నువ్వు ముత్తయిదువు కదా అని దాసు అంటాడు.
పెళ్లి రోజు
ఈ రోజు మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయించా. ఈ రోజు మీ మొదటి పెళ్లి రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం పెద్దలను ఎదిరించి భార్యాభర్తలుగా ఒకటైన రోజు. కానీ ఈ రోజు మీరు విడిపోయిన దంపతులు. అందుకే మొదటి పెళ్లి రోజు గుర్తు లేకుండా పోయింది. నాలాంటి వాడు గుర్తు చేస్తేనే కానీ గుర్తు లేనంత గొప్ప ప్రేమికులు మీరు. మీలాంటి జంటలను చూసే ప్రేమ పెళ్లిళ్లంటే పెద్దవాళ్లు భయపడేది. మీలో ఒక్కరికైనా మీ పెళ్లి రోజు గుర్తుందా అని కాశీ, స్వప్నను దాసు అడుగుతాడు.
ఇంటికి కార్తీక్, దీప
కార్తీక్, దీప ఇంటికి రావడంతో దశరథ కంగారు పడతాడు. దీపను తీసుకుని ఇంటికి ఎందుకు వచ్చావని దశరథ అడుగుతాడు. అప్పుడే వచ్చిన కాంచన, మేమంతా కలిసి హాస్పిటల్ కు వెళ్లామని చెప్తుంది. బిడ్డ విషయంలో కార్తీక్, దీప అబద్ధం ఆడుతున్నారని జ్యోత్స్న అంటుంది. పుట్టబోయే బిడ్డ విషయంలో వీడు బాధపడుతుంటే మీరంతా వీడి మీద ఎంక్వైరీ చేస్తున్నారా అని కార్తీక్ గురించి దశరథ అంటాడు. నిజం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని శివ నారాయణ చెప్తాడు.
డాక్టర్ రిపోర్ట్స్
కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకు ప్రమాదం కాబట్టి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఈ విషయాన్ని కార్తీక్ చెప్పాడని దశరథ అంటాడు. దీపకు వేరే హాస్పిటల్లో టెస్టులు చేయించాం. కాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయని శివ నారాయణ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. ఈ రోజు డాక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ మాట్లాడుతాయని శివ నారాయణ అంటాడు. అది అబద్ధమని తేలితే నిజం ఏంటో మాకు ఇప్పుడే తెలియాల్సి ఉంటుందని శివ నారాయణ చెప్తాడు.
బిడ్డకు ప్రమాదం లేదని
{{/usCountry}}కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకు ప్రమాదం కాబట్టి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఈ విషయాన్ని కార్తీక్ చెప్పాడని దశరథ అంటాడు. దీపకు వేరే హాస్పిటల్లో టెస్టులు చేయించాం. కాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయని శివ నారాయణ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. ఈ రోజు డాక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ మాట్లాడుతాయని శివ నారాయణ అంటాడు. అది అబద్ధమని తేలితే నిజం ఏంటో మాకు ఇప్పుడే తెలియాల్సి ఉంటుందని శివ నారాయణ చెప్తాడు.
బిడ్డకు ప్రమాదం లేదని
{{/usCountry}}తండ్రిని రెచ్చగొట్టి నిజాలు బయటపెట్టేలా చేసేందుకు జ్యోత్స్న ట్రై చేస్తుంది. అప్పుడే జ్యోత్స్నకు డాక్టర్ కాల్ చేస్తుంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకు ప్రమాదం ఉందనేది అబద్ధం. ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చి భయపెట్టారు. తల్లీబిడ్డ ఇద్దరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ బాంబ్ పేలుస్తుంది.
అబద్ధం ఎందుకు?
బిడ్డ విషయంలో ఎందుకు అబద్ధం చెప్పారని కార్తీక్, దీపను అందరు ప్రశ్నిస్తారు. నువ్వు ఈ రోజు అందరికీ సమాధానం చెప్పాల్సిందే బావ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప స్థానంలో నీ కూతురు ఉంటే అప్పుడు నీకు ఈ బాధ తెలిసేదని దశరథతో శివ నారాయణ అంటాడు. అసలు కార్తీక్ చెప్తున్న అబద్ధాలు ఎవరి కోసం? ఈ రోజు నిజం తెలియాల్సిందేనని శివ నారాయణ గట్టిగా అడుగుతాడు. కార్తీక్ తో దీపే అబద్ధం చెప్పించినట్లు ఉందని పారిజాతం అంటుంది.
నిజం చెప్పేసిన దశరథ
అందరు కార్తీక్ ను గుచ్చి గుచ్చి అడిగే సరికి నేను చెప్తానని దశరథ అంటాడు. వీళ్లు నిజమే చెప్పారు. నేను అందరికీ ఈ రోజు నిజం చెప్పే తీరుతాను. దీప కడుపులో బిడ్డకు ప్రమాదం ఉందనేది నిజమే. దీప కడుపులో బిడ్డకు ప్రమాదం నా భార్య వల్ల అని దశరథ చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. వదిన కారణమేంటీ అని కాంచన అడుగుతుంది. మీ వదిన ప్రాణాలతో ఉండాలంటే దీప బిడ్డను త్యాగం చేయాలమ్మా. అదే విధి రాత అని దశరథ అంటాడు.
సుమిత్ర కన్న కూతురు
దీప ఎవరో కాదు సుమిత్ర కన్న కూతురు అని అసలు నిజాన్ని దశరథ చెప్పేస్తాడు. నాకు, సుమిత్రకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు ఈ దీపే నాన్న అని దశరథ అంటాడు. మరి జ్యోత్స్న ఎవరు అని శివ నారాయణ అడిగితే, దాసు కూతురని దశరథ చెప్తాడు. పుట్టగానే హాస్పిటల్లో బిడ్డలను పారిజాతం పిన్ని మార్చేసింది. మన ఇంటి వారసురాలిని అనాథను చేసింది. తన మనవరాలిని ఈ ఇంటి వారసురాలిని చేసింది. ఇదంతా నీ మీద పగతో చేసింది నాన్న అని దశరథ కుంబ బద్ధలు కొడతాడు.
గన్ తో జ్యోత్స్న
ఇప్పుడు నా భార్య సుమిత్రను కాపాడేది నా కన్న కూతురు దీపే. తను డోనర్ గా ఉంటే కడుపులో బిడ్డను బతికించడం కష్టమన్నారు. అయినా సరే కన్న తల్లి కోసం బిడ్డను వదులుకునేందుకు సిద్ధమైంది. దీపే ఈ ఇంటి వారసురాలు. జ్యోత్స్న దాసు కూతురు. ఈ రోజు నుంచి దీప ఈ ఇంటి వారసురాలిగా ఉంటుంది. జ్యోత్స్న తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుందని దశరథ అంటాడు. నీ మనసులో మాట బయటకు చెప్పించాలని ఇలా చేశా డాడీ. ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు ఉండాలని దీపను గన్ తో జ్యోత్స్న షూట్ చేస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.