బిగ్ బాస్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే స్టార్ మా మరో కొత్త రియాలిటీ షోతో రెడీ అవుతోంది. ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు రాబోతుంది. బిగ్ బాస్ లాంటి కాన్సెప్ట్ తోనే, కానీ సింగిల్ గా కాకుండా ఈ సారి జోడీలతో అలరించబోతుంది. ఈ షోకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ జడ్జీగా వ్యవహరిస్తున్నాడు.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్

ఒక ఇంట్లో 10 జంటలను పెట్టి, వీళ్ల మధ్య పోటీ పెట్టి ఎవరు బెస్ట్ అని నిర్ణయించడానికి ఒక కొత్త రియాలిటీ గేమ్ షోతో స్టార్ మా వచ్చేస్తోంది. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే పేరుతో ఈ షోను గ్రాండ్ గా లాంఛ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ షో అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్న స్టార్ మా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
అనిల్ రావిపూడి
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఇప్పటికే టాప్ యాంకర్ శ్రీముఖితో అనౌన్స్ మెంట్ చేసేశారు. ఇప్పుడిక ఈ రియాలిటీ షోకు ఒక జడ్జీగా అనిల్ రావిపూడిని ఇంట్రడ్యూస్ చేశారు.
‘‘ఎఫ్2 చూశారు.. ఎఫ్3 కూడా చూశారు. మరి ఎఫ్10కి రెడీ హా? 10 సెలబ్రిటీ జంటలు. 10 రెట్ల ఫన్. 10 రెట్ల ఫ్రస్టేషన్, ప్రేమకు ఒక అల్టిమేట్ పరీక్ష. మా చీఫ్ రిలేషన్ షిప్ ఆఫీసర్ అనిల్ రావిపూడి నుంచి ఎవరు ఫైనల్ అప్రూవల్ పొందుతారో చూడాలి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కమింగ్ సూన్’’ అని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
షో ఫార్మాట్ ఇలా
బిగ్ బాస్ హౌస్ లో అయితే కంటెస్టెంట్లను ఇండివిజువల్ గా పంపిస్తారు. అక్కడ అందరిది ఒంటరి పోరాటమే. కానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో జోడీగా వెళ్తారు. రియల్ లైఫ్ జోడీలు ట్రోఫీ కోసం పోటీపడతాయి. ఒక పెద్ద విల్లాలంటి ఇంట్లో 10 జోడీలు ఉండబోతున్నాయి. ఈ షో 10 వారాల పాటు సాగుతుంది.
హోస్ట్, జోడీలు
{{/usCountry}}బిగ్ బాస్ హౌస్ లో అయితే కంటెస్టెంట్లను ఇండివిజువల్ గా పంపిస్తారు. అక్కడ అందరిది ఒంటరి పోరాటమే. కానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో జోడీగా వెళ్తారు. రియల్ లైఫ్ జోడీలు ట్రోఫీ కోసం పోటీపడతాయి. ఒక పెద్ద విల్లాలంటి ఇంట్లో 10 జోడీలు ఉండబోతున్నాయి. ఈ షో 10 వారాల పాటు సాగుతుంది.
హోస్ట్, జోడీలు
{{/usCountry}}మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకు శ్రీముఖి హోస్ట్ అని తెలిసింది. ఈ షోలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు తమ పార్ట్ నర్ లతో పార్టిసిపేట్ చేయబోతున్నారని తెలిసింది. హరిత హరీష్, నటరాజ్ మాస్టర్ తమ భార్యలతో కలిసి షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. అలాగే ప్రియాంక జైన్-శివకుమార్, సోనియా సింగ్-పవన్, వాసంతి-పవన్ కల్యాణ్ లాంటి వైరల్ జంటలు కూడా పోటీకి సై అంటున్నాయని టాక్.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోను ప్రతి రోజు రాత్రి ఒక గంట పాటు స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తారని తెలిసింది. జియోహాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం.