2025లో టాక్ ఆఫ్ ది సినిమాగా మారిన చిత్రం మహావతార్ నరసింహా. ఈ యానిమేటెడ్ మూవీ రికార్డులు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడీ చిత్రం మరో చరిత్ర నమోదు చేసింది. ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్ 2026కు నామినేట్ అయిన యానిమేటెడ్ సినిమాల్లో మహావతార్ నరసింహా కూడా ఉంది.
మహావతార్ నరసింహా రికార్డు

యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆస్కార్ కు నామినేట్ అయిన ఇండియన్ ఫస్ట్ యానిమేటెడ్ మూవీగా ఇది నిలిచింది. ఆస్కార్ వాళ్లు తాజాగా ప్రకటించిన యానిమేటెడ్ సినిమాల నామినేషన్ల లిస్ట్ లో మహావతార్ నరసింహా కూడా చోటు దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు కోసం 35 సినిమాలు పోటీపడుతున్నాయి.
బ్లాక్ బస్టర్
మహావతార్ నరసింహ యానిమేటెడ్ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కేజీఎఫ్, సలార్ లాంటి భారీ సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ అన్న సంగతి తెలిసిందే. అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి యానిమేటెడ్ మూవీగా మహావతార్ నరసింహా జులై 25, 2025న థియేటర్లలో రిలీజైంది. జనాలకు ఇది విపరీతంగా నచ్చేసింది.
రూ.30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా చరిత్ర నమోదు చేసింది.
మహావతార్ నరసింహ ఓటీటీ
ఓటీటీలోనూ మహావతార్ నరసింహ దూకుడు కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లొ ఇది సెప్టెంబర్ 19న రిలీజైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని వారాల పాటు ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగింది. ఇప్పటికీ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది.
మహావతార్ నరసింహా కథ
పురాణాలు తెలిసిన ప్రతి ఒక్కరికి నరసింహావతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు పది అవతారాల్లో నరసింహావతారం ఒకటి. ఈ అవతారం ఆధారంగా మహావతార్ నరసింహా యానిమేటెడ్ సినిమాను రూపొందించారు. అహంకారంతో విర్రవీగుతాడు రాక్షస రాజు హిరణ్యకశిపుడు. బ్రహ్మ వరం కారణంగా తనకు మరణం లేదనుకుంటాడు.
{{/usCountry}}పురాణాలు తెలిసిన ప్రతి ఒక్కరికి నరసింహావతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు పది అవతారాల్లో నరసింహావతారం ఒకటి. ఈ అవతారం ఆధారంగా మహావతార్ నరసింహా యానిమేటెడ్ సినిమాను రూపొందించారు. అహంకారంతో విర్రవీగుతాడు రాక్షస రాజు హిరణ్యకశిపుడు. బ్రహ్మ వరం కారణంగా తనకు మరణం లేదనుకుంటాడు.
{{/usCountry}}హరినే ఎదురించి ముల్లోకాలకు అధిపతి తానేనంటాడు. అయితే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు.. విష్ణువుకు మహా భక్తుడిగా మారతాడు. కొడుకును చంపాలని హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నించినా హరి కాపాడుతూనే ఉంటాడు. చివరకు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు విష్ణువు. ఈ కథను అద్భుతమైన విజువల్స్ తో అదిరిపోయేలా చూపించారు.