...
...
Next Story

Anil Ravipudi Mahesh Babu: 2028 సంక్రాంతి టార్గెట్.. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Anil Ravipudi Mahesh Babu: బ్లాక్ బస్టర్ సంక్రాంతి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటి నుంచే 2028 పండగపై కన్నేశారనే ప్రచారం జోరందుకుంది. ఈ సారి మహేష్ బాబుతో సెకండ్ మూవీతో సంక్రాంతి వస్తారని టాక్ వినిపించింది. మరి ఇది నిజమేనా? వీటిపై అనిల్ రావిపూడి రియాక్షన్ ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 26, 2026, 10:07:44 IST
Advertisement

Anil Ravipudi Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి వీళ్ల కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా అనిల్- మహేష్ మూవీ సెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

మహేష్- అనిల్ కాంబో

2028 సంక్రాంతి టార్గెట్.. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్! (x/AnilRavipudi)
2028 సంక్రాంతి టార్గెట్.. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్! (x/AnilRavipudi)

సరిలేరు నీకెవ్వరు మూవీ భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధాన్ని కూడా ఏర్పరిచింది. దీంతో అనిల్ రావిపూడి- మహేష్ బాబు కాంబోలో మళ్లీ ఒక సినిమా వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ మళ్లీ కుదిరిందంటూ నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

2028 సంక్రాంతి

ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు హీరోగా భారీ చిత్రం 'వారణాసి' చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది ఈ చిత్రాన్ని సంక్రాంతి 2028 నాటికి థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

అనిల్ రావిపూడి రియాక్షన్

అయితే మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.

‘‘సూపర్ స్టార్ మహేష్ బాబు నాకెప్పుడూ ఆత్మీయుడే. ఆయన పట్ల అంతులేని ప్రేమ, గౌరవం ఉంది. ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదు. దయచేసి ఇలాంటివి నమ్మకండి. ఈ వార్తలను షేర్ చేయకండి’’ అని అనిల్ రావిపూడి తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పష్టతనిచ్చారు.

'వారణాసి' తర్వాతే

'వారణాసి' తర్వాత చేయబోయే సినిమా కోసం మహేష్ సరికొత్త కథల అన్వేషణలో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తన తదుపరి చిత్రంపై మహేష్ బాబు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది.

మల్టీస్టారర్

మరోవైపు అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్- కళ్యాణ్ రామ్ తో మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe