టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. బన్నీని కలవాలంటే దాదాపు '42 కఠిన నిబంధనలు' పాటించాలంటూ ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

అయితే, ఈ ఆరోపణలను అల్లు అర్జున్ టీమ్ ఇప్పటికే ఖండించడమే కాకుండా, సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్తో కలిసి పనిచేసిన నటీనటులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
'ఆ నిబంధనలన్నీ కట్టుకథలే'
తాజాగా మలయాళ నటుడు శివ హరిహరన్ ఈ వివాదంపై స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. ఇటీవల ఒక శీతల పానీయం ప్రకటన షూటింగ్లో అల్లు అర్జున్తో కలిసి దిగిన ఫోటోను ఆయన పంచుకున్నారు.
42 నిబంధనల వార్తలపై
"బన్నీ గారికి సంబంధించిన ఆ 42 నిబంధనల వార్తలపై నాకు చాలా మంది అభిమానుల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అదంతా ఒక కట్టుకథ మాత్రమే" అని శివ హరిహరన్ స్పష్టం చేశారు.
దయగల నటుల్లో ఒకరు
షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ ప్రవర్తన గురించి శివ హరిహరన్ వివరిస్తూ.. "ఆయన (అల్లు అర్జున్) నేను పనిచేసిన అత్యంత కూల్, దయగల నటులలో ఒకరు. మేము ఫోటో అడగడానికి సంకోచిస్తుంటే, ఆయనే స్వయంగా పిలిచి మరీ ఫోటోలు దిగారు" అని తెలిపారు.
"షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా మా కోసం వేచి ఉండి, మాకు ఫోటోలు అందేలా తన మేనేజర్లను పంపారు. 'హ్యాపీ' సినిమా నుంచి నేను ఆయనకు పెద్ద అభిమానిని, ఇప్పుడు ఆ అభిమానం రెట్టింపు అయింది" అని అల్లు అర్జున్ను శివ హరిహరన్ కొనియాడారు.
అసలు వివాదం ఏమిటి?
కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అల్లు అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "హైదరాబాద్లో అల్లు అర్జున్ను కలవడానికి ముందు మాకు 42 నిబంధనలతో కూడిన ఒక నోట్ ఇచ్చారు. సార్ (అల్లు అర్జున్) కళ్లలోకి నేరుగా చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు వంటి వింత నిబంధనలు అందులో ఉన్నాయి" అని ఆమె పేర్కొన్నారు.
పూర్తిగా నిరాధారం
{{/usCountry}}కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అల్లు అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "హైదరాబాద్లో అల్లు అర్జున్ను కలవడానికి ముందు మాకు 42 నిబంధనలతో కూడిన ఒక నోట్ ఇచ్చారు. సార్ (అల్లు అర్జున్) కళ్లలోకి నేరుగా చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు వంటి వింత నిబంధనలు అందులో ఉన్నాయి" అని ఆమె పేర్కొన్నారు.
పూర్తిగా నిరాధారం
{{/usCountry}}ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ టీమ్ ఘాటుగా స్పందించింది. "అల్లు అర్జున్పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. ఆయన ఎప్పుడూ ఎంతో హుందాగా, గౌరవంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. బాధ్యులపై మా లీగల్ టీమ్ పరువు నష్ట దావా వేస్తోంది" అని ఒక ప్రకటన విడుదల చేశారు.
అల్లు అర్జున్ తదుపరి చిత్రాలు
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో (AA22) ఒక భారీ పాన్-ఇండియా చిత్రంలో ఆయన నటించనున్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. దీనితో పాటు, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు బన్నీ పచ్చజెండా ఊపారు.