చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. వింటేజీ లుక్, యాక్టింగ్ తో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో అదరగొట్టారు. దీంతో కుటుంబాలకు కుటుంబాలు థియేటర్లకు వరుస కట్టాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీలు ఇంట్లోనే కూర్చుని మన శంకర వరప్రసాద్ గారు సినిమాను చూసే రోజు వచ్చేసింది. ఇవాళ (ఫిబ్రవరి 11) మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయింది.
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ

రీసెంట్ టైమ్స్ లో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ మోత మోగించింది. ఇప్పుడు ఓటీటీని షేక్ చేసేందుకు బుధవారం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జీ5 ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు రిలీజైంది.
ఏడు భాషల్లో
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీలోకి ఏకంగా ఏడు భాషల్లో రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.
సంక్రాంతి విన్నర్
సంక్రాంతి 2026కు తెలుగులో అయిదు సినిమాలు థియేటర్లలో రిలీజైంది. ఇందులో మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ మూవీ రూ.380 కోట్ల కలెక్షన్లతో సంక్రాంతి రేసులో దూసుకెళ్లింది. ఈ మూవీలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ తదితరులు నటించారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ
ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలో శంకర వరప్రసాద్ (చిరంజీవి) చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉంటారు. ఆయన అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. కానీ జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ బాస్ శశిరేఖ (నయనతార) పరిచయంతో వరప్రసాద్ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఆమెతో చూస్తుండగానే పెళ్లి అయిపోతుంది. కానీ శశిరేఖ తండ్రి (సచిన్ ఖేడేకర్)కు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. అందుకే వరప్రసాద్, శశిరేఖను విడదీస్తాడు. తన పిల్లలకూ వరప్రసాద్ దూరమవుతాడు.
{{/usCountry}}ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలో శంకర వరప్రసాద్ (చిరంజీవి) చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉంటారు. ఆయన అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. కానీ జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ బాస్ శశిరేఖ (నయనతార) పరిచయంతో వరప్రసాద్ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఆమెతో చూస్తుండగానే పెళ్లి అయిపోతుంది. కానీ శశిరేఖ తండ్రి (సచిన్ ఖేడేకర్)కు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. అందుకే వరప్రసాద్, శశిరేఖను విడదీస్తాడు. తన పిల్లలకూ వరప్రసాద్ దూరమవుతాడు.
{{/usCountry}}కట్ చేస్తే కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) సెక్యూరిటీని వరప్రసాద్ చూసుకుంటాడు. శర్మకు వరప్రసాద్ చాలా క్లోజ్ అవుతాడు. ఈ క్రమంలోనే విడిపోయిన భార్య, పిల్లలకు వరప్రసాద్ ను దగ్గర చేయాలని శర్మ అనుకుంటాడు.
ఈ క్రమంలో తన పిల్లలు చదువుతున్న స్కూల్లో పీఈటీగా వెళ్తాడు వరప్రసాద్. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శశిరేఖ, వరప్రసాద్ ఎందుకు విడిపోయారు? ఇందులో వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్రకు ఉన్న సంబంధం ఏమిటన్నదే మన శంకర వరప్రసాద్ గారు మూవీ స్టోరీ.