ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో, నటి, సామాజిక సేవకురాలు మంచు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన టీచ్ ఫర్ ఛేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026 హైదరాబాద్లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, కార్పొరేట్, విద్యా రంగం, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లల నాణ్యమైన విద్యకు మద్దతు తెలిపారు.
స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల మధ్య

ఈ వార్షిక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, వెనుకబడిన వర్గాల పిల్లల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం వంటి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ప్రతి చిన్నారికి వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులు ఏవైనా సరే, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల మధ్య భాగస్వామ్యం అవసరమని ఈ వేదిక నొక్కి చెప్పింది.
ఈ వేడుకలో భాగంగా భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విద్యా సేవకు మద్దతుగా ర్యాంప్ వాక్ చేశారు. ప్రముఖ డిజైనర్ రామ్జ్ రూపొందించిన ప్రత్యేక కలెక్షన్స్తో పాటు సాఖీ హెరిటేజ్ దుస్తులు, రోజ్ జ్యువెలరీ ఆభరణాలను ప్రదర్శించారు. ఈ ఫ్యాషన్ ప్రదర్శన సినిమా, ఫ్యాషన్, సేవ భావనల సమ్మేళనంగా నిలిచింది.
లక్ష్మీ మంచుతో పాటు హీరోయిన్లు
ఈ కార్యక్రమంలో లక్ష్మీ మంచుతో పాటు హీరోయిన్లు సీరత్ కపూర్, అక్షర గౌడ, పాయల్ రాజ్పుత్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, ఫరియా అబ్దుల్లా, మాన్విత కామత్, తేజు అశ్విని, రాశి సింగ్, శివాని నాగరం, దక్ష నగర్కర్, అభిజ్ఞ వుత్తలూరు, పావని, నందిత శ్వేత ర్యాంప్ వాక్ చేశారు.
వీరితోపాటు సీనియర్ హీరోయిన్ సుహాసిని, చారిత వర్మ, రితికా నాయక్, అమృత అయ్యర్, ఐశ్వర్య అర్జున్, శ్రీదేవి (కోర్ట్ ఫేమ్), జయప్రద, అవంతిక సుందర్, సంద్యా రాజు, రాఫ్తార్ ర్యాంప్ వాక్ చేశారు.
హీరోలు కూడా
{{/usCountry}}వీరితోపాటు సీనియర్ హీరోయిన్ సుహాసిని, చారిత వర్మ, రితికా నాయక్, అమృత అయ్యర్, ఐశ్వర్య అర్జున్, శ్రీదేవి (కోర్ట్ ఫేమ్), జయప్రద, అవంతిక సుందర్, సంద్యా రాజు, రాఫ్తార్ ర్యాంప్ వాక్ చేశారు.
హీరోలు కూడా
{{/usCountry}}అలాగే, హీరోలు ప్రియదర్శి, శివ కందుకూరి, రోషన్, అరవింద్ కృష్ణ, ప్రిన్స్, విరాజ్ అశ్విన్, సౌరభ్ ధింగ్రా, విశ్వంత్, ఆదిత్, రోషన్ కె, అర్జున్ జాండర్ లామా, నందు, నిఖిల్ విజయేంద్ర సింహ, ప్రియతమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థను 2014లో మంచు లక్ష్మి స్థాపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూమ్స్, ఐసీటీ ఆధారిత అభ్యాసం, ఉపాధ్యాయుల శిక్షణ, వాలంటీర్ కార్యక్రమాలు, ప్రాథమిక చదువు-లెక్కల నైపుణ్యాల అభివృద్ధిపై ఈ సంస్థ పనిచేస్తోంది.
3 లక్షల మందికిపైగా
ఇప్పటి వరకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులపై ప్రభావం చూపింది. అలాగే, 1,549 ప్రభుత్వ పాఠశాలలకు మద్దతుగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
టీచ్ ఫర్ ఛేంజ్ చైర్పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. "ప్రతి చిన్నారికి, వారి నేపథ్యం ఏదైనా సరే, నాణ్యమైన విద్య అందాలి అనే నమ్మకంతోనే టీచ్ ఫర్ ఛేంజ్ ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలిక సామాజిక మార్పు సాధ్యమవుతుంది" అని అన్నారు.
ఇలా భాగస్వామ్యం కావాలంటూ
"ఈ నిధుల సేకరణ కార్యక్రమం కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, భాగస్వాములు, దాతలు, వాలంటీర్లు కలిసి పిల్లల భవిష్యత్తును మార్చే ఉద్యమం. కలిసి మనం లక్షలాది పిల్లల భవిష్యత్తును వెలుగులోకి తీసుకురాగలం" అని మంచు లక్ష్మి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలనుకునే వ్యక్తులు, సంస్థలు, వాలంటీర్లు www.teachforchange.in ద్వారా భాగస్వామ్యం కావాలని టీచ్ ఫర్ ఛేంజ్ ఆహ్వానించింది.