బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా దంపతులకు న్యాయపరమైన కష్టాలు మరింత పెరిగాయి. ముంబైలో నమోదైన రూ. 60 కోట్ల మనీ లాండరింగ్ (ఆర్థిక నేరం) కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఉన్న సెక్షన్లకు తోడుగా, తాజాగా ఈ దంపతులపై 'చీటింగ్' (మోసం) అభియోగాలను కూడా మోపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు మరింత కష్టాలు తోడైనట్లు అయింది.
అసలేం జరిగింది? కొత్తగా చేర్చిన సెక్షన్లు ఏమిటి?
పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. ఈ హై ప్రొఫైల్ దంపతులపై గతంలో భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 406 (నమ్మక ద్రోహం) కింద కేసు నమోదైంది. అయితే, ఈ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాల ఆధారంగా ఇప్పుడు సెక్షన్ 420 (చీటింగ్ - ఆస్తుల విషయంలో నమ్మించి వంచించడం) కింద అదనపు చార్జీలను చేర్చారు.
దేశంలో కొత్త చట్టాలు (భారతీయ న్యాయ సంహిత - BNS) 2024, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ కేసు అంతకంటే ముందే ఫైల్ కావడంతో పాత ఐపీసీ సెక్షన్ల ప్రకారమే విచారణ కొనసాగుతోంది. ఐపీసీ సెక్షన్ 420 కింద అభియోగాలు రుజువైతే, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.
కేసు నేపథ్యం ఇదే..
ముంబైలోని జుహూ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఈ కేసు పెట్టారు. గతంలో శిల్పా, రాజ్లు డైరెక్టర్లుగా ఉన్న 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీలో పెట్టుబడులు, రుణాల పేరుతో తన వద్ద రూ. 60.4 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈ దంపతుల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు.
రాజ్ కుంద్రా ఘాటు స్పందన
{{/usCountry}}ముంబైలోని జుహూ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఈ కేసు పెట్టారు. గతంలో శిల్పా, రాజ్లు డైరెక్టర్లుగా ఉన్న 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీలో పెట్టుబడులు, రుణాల పేరుతో తన వద్ద రూ. 60.4 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈ దంపతుల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు.
రాజ్ కుంద్రా ఘాటు స్పందన
{{/usCountry}}తమపై వస్తున్న తాజా అభియోగాలను రాజ్ కుంద్రా తీవ్రంగా ఖండించారు. తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు.
"మాపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. కేవలం దురుద్దేశంతోనే ఇవి ప్రచారం చేయబడుతున్నాయి. ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేకపోయినా, ఒక పౌర వివాదాన్ని క్రిమినల్ కేసుగా రంగు పులుముతున్నారు. దీనిపై ఇప్పటికే మేము గౌరవనీయ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాము" అని రాజ్ కుంద్రా తెలిపారు.
సంయమనం పాటించాలి
"మేము దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాము. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కోర్టు పరిధిలో కేసు ఉన్నందున మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాను" అని రాజ్ కుంద్రా తన పోస్ట్లో పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఈ వ్యవహారం ముంబై వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ సెలబ్రిటీ దంపతులు ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.
కాగా, శిల్పా శెట్టి తెలుగులో మోహన్ బాబు, వెంకటేష్లతో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.