...
...
Next Story

శివ సినిమా చూసి ఏఎన్నార్ ఏమన్నారంటే? మళ్లీ భార్య అమలతో కలిసి నటించాలనుంది: నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్లు

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల అక్కినేని నటించిన 'శివ' సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్‌పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా శివ సినిమా చూసి ఏఎన్నార్ ఏమన్నారో కూడా చెప్పారు.

Published on: Nov 12, 2025, 05:40:21 IST
Advertisement

రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ఐకానిక్ చిత్రం 'శివ' (1989) నవంబర్ 14న థియేటర్లలో మళ్లీ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. నాగార్జున, అమల అక్కినేని, రఘువరన్ నటించిన ఈ క్లాసిక్ చిత్రాన్ని రీమాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రెస్‌తో మాట్లాడిన నాగార్జునను.. ఈ సినిమా రీమేక్‌లో తన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్ అక్కినేని నటిస్తారా అని అడగ్గా, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సినిమా చూసి నాన్న ఏమన్నారో కూడా నాగార్జున వెల్లడించారు.

నాన్న ఏమన్నారంటే?

నాగ చైతన్య, నాగార్జున, అఖిల్
నాగ చైతన్య, నాగార్జున, అఖిల్

‘శివ’లో తనను మొదటిసారి చూసినప్పుడు తన తండ్రి (దివంగత నాగేశ్వరరావు) ఎలా స్పందించారో నాగార్జున గుర్తుచేసుకున్నారు. “సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత మా నాన్న ఆ సినిమా చూశారు. అప్పుడు రకరకాల కామెంట్లు వస్తున్నా, ఆయన నన్ను డ్రైవ్‌కు తీసుకెళ్లి సినిమా పెద్ద హిట్ అని చెప్పారు” అని నాగార్జున తెలిపారు.

ఆర్జీవీకి థ్యాంక్స్

'శివ' లాంటి అద్భుతమైన సినిమాను అందించినందుకు ఆర్జీవీకి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ “కొన్ని రోజుల క్రితం నేను మళ్లీ 'శివ' చూసినప్పుడు అదొక కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. అది నిజంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అనుభవం. ఇలాంటి అద్భుతమైన సినిమాను అందించినందుకు ఆర్జీవీకి థ్యాంక్స్” అని నాగార్జున అన్నారు.

శివ రీమేక్

ఈ సినిమా రీమేక్‌లో తన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్ నటిస్తారా అని అడిగినప్పుడు, నాగార్జున నవ్వి.. “'శివ'ను రీమేక్ చేసేంత దమ్ము చైతూ, అఖిల్‌కు లేదు” అని సమాధానమిచ్చారు. అలాగే తన భార్య అమలతో కలిసి మళ్లీ ఒక సినిమాలో నటించాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు.

శివ గురించి

ఈ సినిమాలో నాగార్జున, అమల విద్యార్థులుగా శివ, ఆశ పాత్రలలో నటించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. నాగార్జున కెరీర్‌లో ఇది ఒక బ్రేక్‌త్రూ చిత్రంగా చెప్తారు. నాగార్జున చివరిసారిగా లోకేష్ కనగరాజ్ 'కూలీ'లో కనిపించారు. చైతన్య చివరిగా చందూ మొండేటి 'తండేల్'లో, అఖిల్ సురేందర్ రెడ్డి 'ఏజెంట్'లో నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks