...
...
Next Story

బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే.. ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజ్

వాలంటైన్స్ డేకి ప్రేమికుల కోసం వస్తున్న బ్యూటిపుల్ మ్యూజికల్ లవ్ డ్రామా సినిమా నిలవే. సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న నిలవే మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Published on: Jan 22, 2026 11:08 AM IST
Advertisement

పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాతలుగా నిర్మించిన సినిమా నిలవే. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసుకుంది.

నిలవే రిలీజ్ డేట్

బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే.. ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజ్
బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే.. ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజ్

ప్రస్తుతం నిలవే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా నిలవే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా 2026 ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలు

బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన నిలవే సినిమా భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇలాంటి లవ్ డ్రామా చిత్రంలో సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించారు.

నిలవే ముఖ్య పాత్రలు

వీరు మాత్రమే కాకుండా హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు నిలవే సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

మంచి మ్యూజికల్ హిట్‌గా

ఇక మంచి మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంటూన్న నిలవే సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. అలాగే, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్ రాసిన పాటలకు కోటి అదనపు లిరిక్స్ అందించారు. సత్య.జి ఎడిటింగ్‌తో సినిమా మరింత ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది ఈ సినిమా.

నిలవే సాంకేతిక వర్గం

మొత్తంగా, కొత్తదనంతో పాటు భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన నిలవే చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైందని మేకర్స్ చెప్పారు. కాబట్టి వాలంటైన్స్ డేకి ప్రేమికుల కోసం ఓ తెలుగు సినిమా వచ్చేస్తోందని తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe