నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 28 ఎపిసోడ్ లో.. అరిష్టాలు ఈ మనిషి (శాలిని) కారణంగా జరుగుతాయి. కానీ చంద్ర వదిన వల్ల కాదు అని మరోసారి శాలినిపై క్రాంతి సీరియస్ అవుతాడు. యాగంలో మనం కూడా కూర్చుందామని శాలిని అడుగుతుంది. అలాంటివి జరగవని క్రాంతి క్లారిటీగా చెప్పేస్తాడు.
జూనియర్ గురించి

చంద్రకళకు ఫోన్ చేసి విరాట్ మాట్లాడతాడు. జూనియర్ ఏమంటున్నాడు అని కడుపులో బిడ్డ గురించి అడుగుతాడు. అమ్మానాన్న ఎలా ఉన్నారు? జూనియర్ గురించి మాట్లాడుతూ మురిసిపోతుంటారు కదా. మీ అందరితో కలిసి ఉండాలని నాకుంది. కానీ ఇప్పుడు దూరంగా ఉన్నానని విరాట్ అంటాడు.
చంద్రకళ కన్నీళ్లు
విరాట్ మాటలకు ఎమోషనల్ అయిన చంద్రకళ ఏడ్చేస్తుంది. కళ్లు తిరుగుతున్నాయని అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది. విరాట్ ను చాలా మిస్ అవుతున్నానని ఏడుస్తూ అతని షర్ట్ పక్కన పెట్టుకుని చంద్ర పడుకుంటుంది. ఉదయం యాగం కోసం ఏర్పాట్లు చేస్తారు.
యాగం ఏర్పాట్లు
కామాక్షి పనులేవీ చేయకుండా ఆపిల్ తింటూ ఉండటంపై శ్యామల కోప్పడుతుంది. పూలు ఇచ్చి మాల గుచ్చమని చెప్తుంది. పంతులు వస్తాడు. నా కడుపులో ఉన్న బిడ్డ వల్ల అత్తయ్య ప్రాణాలకు గండం ఉందని చెప్పారు. అత్తయ్య ప్రాణాలకు కానీ నా బిడ్డ ప్రాణాలకు కానీ ఏ అపాయం లేకుండా ఉండాలని ఈ యాగం చేస్తున్నామని పంతులుకు చంద్ర చెప్తుంది.
శాలిని ప్లాన్
పూజలో అపశ్రుతి కలిగేలా చేయాలని శాలిని అనుకుంటుంది. చంద్రను కాదని జగదీశ్వరి ప్రసాదం వండుతుంది. కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి యాగం కోసం వెళ్తుంది. శాలిని వచ్చి కుక్కర్ పేలేలా సెట్ చేస్తుంది. జగదీశ్వరి, రఘురాం కలిసి యాగం పూర్తి చేస్తారు.
పేలిన కుక్కర్
పంతులు ప్రసాదం గురించి అడిగేసరికి జగదీశ్వరి కిచెన్ వైపు వెళ్తుంది. అప్పుడే కుక్కర్ పేలి జగదీశ్వరి మీద పడేందుకు వస్తుంది. మాయ వచ్చి జగదీశ్వరిని లాగేసి కాపాడుతుంది. శుభకార్యం జరుగుతుంటే ఈ అపశకునం ఏంటీ? సిద్ధాంతి చెప్పినట్లు అత్తయ్యకు ప్రాణగండం మొదలైందా? అని శాలిని కావాలని డ్రామా స్టార్ట్ చేస్తుంది.
సిద్ధాంతి మాటలు
{{/usCountry}}పంతులు ప్రసాదం గురించి అడిగేసరికి జగదీశ్వరి కిచెన్ వైపు వెళ్తుంది. అప్పుడే కుక్కర్ పేలి జగదీశ్వరి మీద పడేందుకు వస్తుంది. మాయ వచ్చి జగదీశ్వరిని లాగేసి కాపాడుతుంది. శుభకార్యం జరుగుతుంటే ఈ అపశకునం ఏంటీ? సిద్ధాంతి చెప్పినట్లు అత్తయ్యకు ప్రాణగండం మొదలైందా? అని శాలిని కావాలని డ్రామా స్టార్ట్ చేస్తుంది.
సిద్ధాంతి మాటలు
{{/usCountry}}ఇదంతా చూస్తుంటే శాలిని అన్నట్లు సిద్ధాంతి చెప్పింది నిజమని అనిపిస్తుందని కామాక్షి కూడా అంటుంది. అలాంటిదేం లేదు. శాలిని మాటలు పట్టించుకోవద్దు. ఛాన్స్ తీసుకుని అందరిని బాధపెట్టాలని చూడకు అని క్రాంతి అంటాడు. దేవుడే కాపాడాడు. పూజఫలం కనిపిస్తోందని పంతులు చెప్తాడు.
యాగం పూర్తి
చంద్రకళ ప్రసాదం వండుతుంది. మొత్తానికి యాగం నిర్విఘ్నంగా పూర్తి చేశాం. ఇక మీ ఇంట్లో ఎవరికీ ప్రాణ గండం ఉండదు. అందరూ నిశ్చింతగా ఉండండని పంతులు ఆశీర్వదించి వెళ్లిపోతాడు. అమ్మవారిని చంద్రకళ వేడుకోవడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.