నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో జగదీశ్వరి జడలో మల్లెపూలు పెడతాడు రఘురాం. అప్పుడే వదిన అంటూ శ్యామల, కామాక్షి వస్తారు. అందరిని డిస్టర్బ్ చేయడమేనా? మీ పని అని అంటాడు రఘురాం. మరోవైపు రాజ్ అప్పుల లెక్కలు వేస్తాడు. రూ.9 లక్షలు అప్పు అయిందని అమ్మతో చెప్తాడు. శ్రుతి పడిపోయింది, పెళ్లి చేసుకున్నాక అప్పు తీర్చేస్తానని అంటాడు.
రాజ్ కు తల్లి సలహా

శ్రుతి మంచిదో, పిచ్చిదో అర్థం కావడం లేదు. లేదంటే నీ వేషాలు కనిపెట్టేదే. అసలు ఆ ఇంద్రభవనంలో శ్రుతి యువరాణో చెలికత్తో ఎవరికి తెలుసు? నువ్వు సరైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావో లేదో చెక్ చేసుకోరా అని రాజ్ కు సరోజ సలహానిస్తుంది. అదే పని చేస్తానని రాజ్ అంటాడు.
గుడికి వెళ్లకుండా
రేపు మనం గుడికి వెళ్లకపోవడమే మంచిదనిపిస్తుంది శాలిని అని క్రాంతి అంటాడు. అత్తయ్యకు వస్తానని చెప్పి ఇప్పుడ ఇలా అంటావేంటీ అని శాలిని అడుగుతుంది. నీ మంచి కోసమే శాలిని. ఈ రోజు వదిన నాన్న మైండ్ ను పొల్యూట్ చేసి నువ్వే దోషివని చెప్పించాలని చూసింది. అంటే తనను తాను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. మొక్కు తీరకుండా చేసి నీపై తోసేస్తుందేమోనని క్రాంతి అంటాడు. రాకపోతే మొక్కు తీరడం ఇష్టం లేదేమో అంటారని శాలిని చెప్తుంది.
రఘురాం మిస్సింగ్
ఉదయం రఘురాం కుటుంబం గుడికి వెళ్తుంది. చీరలను చంద్రకళ టేబుల్ పై పెడుతుంది. ఫ్యామిలీ అంతా గుడిలో ప్రదక్షిణలు చేస్తుంది. అప్పుడే రాజ్ కూడా గుడికి వస్తాడు. ఈ రోజు ఫ్యామిలీలో శ్రుతికి ఉన్న వాల్యూ ఏంటో కనిపెడతానని తల్లికి ఫోన్ చేసి చెప్తాడు రాజ్. మరోవైపు ఎవరి కోసమో ఎదురు చూస్తుంటుంది శాలిని. కానీ క్రాంతి అడిగితే కవర్ చేస్తుంది.
రాజ్ గుడి గంట కొట్టడంతో రఘురాం డైవర్ట్ అవుతాడు. ఒక్కడే ఆగిపోతాడు. మీ అన్నయ్య ఎక్కడ? అని జగదీశ్వరి అడిగితే వెనకాల వస్తున్నాడేమో అని కామాక్షి చెప్తుంది. రఘురాం వెళ్లి ప్రసాదం తీసుకుంటాడు. మళ్లీ గంట సౌండ్ కు మర్చిపోతాడు. ఎందుకు వచ్చాను? గుర్తు రావడం లేదు అని రఘురాం వెళ్లిపోతాడు.
చీప్ గా మాటలు
{{/usCountry}}రాజ్ గుడి గంట కొట్టడంతో రఘురాం డైవర్ట్ అవుతాడు. ఒక్కడే ఆగిపోతాడు. మీ అన్నయ్య ఎక్కడ? అని జగదీశ్వరి అడిగితే వెనకాల వస్తున్నాడేమో అని కామాక్షి చెప్తుంది. రఘురాం వెళ్లి ప్రసాదం తీసుకుంటాడు. మళ్లీ గంట సౌండ్ కు మర్చిపోతాడు. ఎందుకు వచ్చాను? గుర్తు రావడం లేదు అని రఘురాం వెళ్లిపోతాడు.
చీప్ గా మాటలు
{{/usCountry}}రఘురాం కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ పడి వెతుకుతారు. శ్రుతిని శ్యామల నానామాటలు అంటుంది. ఎందుకు ఇంత చీప్ గా మాటలు అంటుందని రాజ్ అనుకుంటాడు. శ్రుతిని తీసుకొని రాజ్ పక్కకువెళ్తాడు. మీ పెద్దమ్మ ఏంటి నిన్ను మరీ పనిమనిషిలా ట్రీట్ చేస్తోంది. మీ ఇంట్లో వాళ్లకు నువ్వంటే లెక్కలేదా? అని అడుగుతాడు రాజ్. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.