పాంచ్ మినార్ రివ్యూ.. 5 కోట్లు తీసుకొచ్చి తంటాలు.. రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ మూవీ నవ్వించిందా?

రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన పాంచ్ మినార్ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే అంటే ఇవాళ (నవంబర్ 20) మీడియాకు పాంచ్ మినార్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పాంచ్ మినార్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 20, 2025 3:45 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్‌: పాంచ్‌ మినార్‌

పాంచ్ మినార్ రివ్యూ.. 5 కోట్లు తీసుకొచ్చి తంటాలు.. రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ మూవీ నవ్వించిందా?
పాంచ్ మినార్ రివ్యూ.. 5 కోట్లు తీసుకొచ్చి తంటాలు.. రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ మూవీ నవ్వించిందా?

నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, రవి వర్మ, నితిన్ ప్రసన్న, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాతలు: మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి

నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పీ

సమర్పణ: గోవింద రాజు

విడుదల తేది: 21 నవంబర్‌ 2025

ఇటీవల ఆహా ఓటీటీలోకి చిరంజీవ సినిమాతో అలరించిన రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించారు.

ఇప్పటికే రిలీజైన పాంచ్ మినార్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ 21న పాంచ్ మినార్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే, రిలీజ్‌కు ఒకరోజు ముందే అంటే ఇవాళ (నవంబర్ 20) మీడియాకు పాంచ్ మినార్ స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పాంచ్ మినార్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కృష్ణచైతన్య అలియాస్‌ కిట్టు (రాజ్‌ తరుణ్‌) లవర్ ఖ్యాతి(రాశి సింగ్‌) ఒత్తిడి చేయడంతో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లో చేరినట్లు అబద్ధం చెబుతాడు. కానీ, డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు అని క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటాడు కిట్టు. ఒక రోజు కిట్టు క్యాబ్ ఎక్కిన ఇద్దరు కిరాయి హంతకులు అతని ముందే గ్యాంగ్‌స్టర్ చోటు (రవి వర్మ)ను హత్య చేస్తారు.

హత్య చేసినందుకు ఇద్దరు హంతకులకు రూ. 5 కోట్లు వస్తాయి. ఐదు కోట్లు తీసుకుని వెళ్తున్న క్రమంలో హంతకులు పోలీసులకు చిక్కుతారు. అదే సమయంలో ఐదు కోట్లు మాయం అవుతాయి.

ఆ తర్వాత ఏమైంది? ఆ 5 కోట్లు ఎవరు తీశారు? కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చింది? ఎవరు కిట్టుకు వచ్చిన కష్టాలు ఏంటీ? కిట్టు వెంట ఎందుకు కిరాయి హంతకులు, సీఐ (నితిన్ ప్రసన్న) ఎందుకు పడ్డారు? చివరికి ఐదు కోట్లు ఎవరికి దక్కాయి? పాంచ్ మినార్ అని టైటిల్‌కు కారణం ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

పాంచ్ మినార్ ఒక క్రైమ్ కామెడీ సినిమా. ఒక చిన్న రొటీన్ స్టోరీనే. కానీ, చూస్తున్నంత సేపు నవ్వించేలా ఉంటుంది. ఉద్యోగానికి బదులు ఈజీగా డబ్బు సంపాదించాలనుకునే ఓ యువకుడు ఎలాంటి కష్టాలు కొనితెచ్చుకున్నాడు, ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు అన్నదే పాంచ్ మినార్ కథ.

క్రైమ్ కామెడీ జోనర్‌కు తగినట్లుగా సినిమాలో కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓ వైపు నటీనటుల నుంచి కామెడీని రాబట్టుకున్న దర్శకుడు మరోవైపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బాగా వచ్చేలా రాసుకున్నాడు. అలాగే, ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తి పెంచేలా సీన్స్ రావడం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కామెడీ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.

క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

చోటు హత్య తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. పాంచ్‌ మినార్‌ పదం కిట్టు జీవితాన్ని ఎలా మార్చేసిందనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే ఫాస్ట్‌గా సాగుతుంది.

ప్రాణాలతో పాటు డబ్బుని దక్కించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. అక్కడక్కడ వచ్చే కొద్దిపాటి టిస్టులు థ్రిలింగ్‌ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో, మంచి టేకింగ్‌తో డైరెక్టర్ రామ్ కడుముల సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. విజువల్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. బీజీఎమ్ సీన్స్‌కు తగినట్లు హైలెట్‌గా నిలిచింది. ఇక రాజ్ తరుణ్ కిట్టు పాత్రలో ఆకట్టుకున్నాడు. రాశి సింగ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే

మిగతా పాత్రలు నవ్విస్తూ థ్రిల్లింగ్ పంచాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో కలిసి నవ్వుకునే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీనే పాంచ్ మినార్.

రేటింగ్: 3/5