రణవీర్ సింగ్ నటించిన బ్లాక్బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రెట్రో సాంగ్స్ (పాత పాటలు) వాడకం సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చిపెట్టింది. తాజాగా పాకిస్థాన్కు చెందిన ప్రముఖ గాయకుడు హసన్ జహంగీర్.. తన ఐకానిక్ సాంగ్ 'హవా హవా' (Hawa Hawa) హక్కుల కోసం ధురంధర్ మేకర్స్ తనకు భారీ మొత్తాన్ని చెల్లించారని వెల్లడించాడు.
50,000 డాలర్లు చెల్లించిన మేకర్స్

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హసన్ జహంగీర్.. ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ టీమ్ తన పాటను వాడుకోవడానికి అధికారికంగా అనుమతి తీసుకున్నారని తెలిపాడు. ఈ పాట హక్కుల కోసం తనకు 50,000 డాలర్లు (సుమారు రూ. 45 లక్షలు) చెల్లించినట్లు అతడు ధృవీకరించాడు.
"గతంలో కాపీరైట్ వ్యవస్థ అంత బలంగా లేదు. కానీ ఇప్పుడు నా పాటలు ఎవరు వాడాలన్నా ముందుగా పర్మిషన్ తీసుకుంటున్నారు. డబ్బు కూడా చెల్లిస్తున్నారు" అని అతడు పేర్కొన్నాడు. నిజంగానే ఇచ్చారా అని ఈ ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ ప్రశ్నించగా.. నిజంగానే అంత డబ్బు ఇచ్చారని, తన అనుమతి కూడా తీసుకున్నారని అతడు వెల్లడించాడు. 1987లో విడుదలైన ఈ సాంగ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కూడా నేటి తరాన్ని ఉర్రూతలూగిస్తోంది.
సంజయ్ దత్ మాస్ ఎంట్రీ
'ధురంధర్' సినిమాలో ఈ పాట ఎక్కడ వస్తుందో తెలుసా? ఎడారి నేపథ్యంలో ఎస్పీ అస్లాం (సంజయ్ దత్) డ్రగ్ పెడ్లర్లను ఎదుర్కొనే సీన్లో ఈ 'హవా హవా' పాట ప్లే అవుతుంది. సంజయ్ దత్ తనదైన శైలిలో విలన్లను మట్టికరిపిస్తుంటే, బ్యాక్గ్రౌండ్లో ఈ రెట్రో సాంగ్ రావడం ప్రేక్షకులకు అదిరిపోయే కిక్ ఇచ్చింది.
ఈ సినిమాలో 'హవా హవా'తో పాటు రాంబా హో, పియా తూ అబ్ తో ఆజా వంటి మరికొన్ని పాత హిందీ పాటలను కూడా కథా గమనంలో భాగంగా వాడారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
{{/usCountry}}ఈ సినిమాలో 'హవా హవా'తో పాటు రాంబా హో, పియా తూ అబ్ తో ఆజా వంటి మరికొన్ని పాత హిందీ పాటలను కూడా కథా గమనంలో భాగంగా వాడారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
{{/usCountry}}గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’.. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేయగా, కేవలం భారత బాక్సాఫీస్ వద్దే రూ. 1,000 కోట్లు దాటిన మొదటి బాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించింది.
ఇది ఒక ఇండియన్ స్పై కరాచీ అండర్వరల్డ్లోకి చొరబడి చేసే ఆపరేషన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్. 26/11 ముంబై దాడులు, పార్లమెంట్ దాడి వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు.
ధురందర్ సీక్వెల్ - పవన్ కళ్యాణ్తో పోటీ
'ధురంధర్' సీక్వెల్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదట ఇది కన్నడ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' (Toxic) తో తలపడుతుందని అనుకున్నా.. ఆ సినిమా జూన్ 4కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ కు గట్టి పోటీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) నిలుస్తోంది. మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది.