తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, దర్శకుడిగా పేరున్న ఆర్. పార్థిబన్, హీరోయిన్ త్రిష కృష్ణన్ మధ్య మొదలైన 'మాటల యుద్ధం' కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఒక అవార్డు వేడుకలో త్రిష గురించి పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.

దీనిపై త్రిష కృష్ణన్ కూడా ఘాటుగా స్పందించడంతో, తాజాగా పార్థిబన్ దాదాపు ఎనిమిది నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసి తన వివరణ ఇచ్చారు. అందులో త్రిషకు పార్థిబన్ క్షమాపణలు చెప్పారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
ఆదివారం (మార్చి 8) జరిగిన ఒక కార్యక్రమంలో పార్థిబన్ మాట్లాడుతూ.. 'పొన్నియిన్ సెల్వన్'లో త్రిష పోషించిన కుందవై పాత్రను ప్రస్తావించారు. "ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే కూర్చోవాలి" అంటూ పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై త్రిష ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు.
"మైక్రోఫోన్ దొరికినంత మాత్రాన చేసే వ్యాఖ్యలు తెలివైనవిగానో, హాస్యంగానో మారిపోవు. అది కేవలం మూర్ఖత్వాన్ని మాత్రమే బిగ్గరగా వినిపిస్తుంది" అంటూ పార్థిబన్ పేరు ఎత్తకుండానే చురకలు అంటించారు త్రిష. తన ఫోటోను స్క్రీన్పై ప్రదర్శించాలని పార్థిబన్ తన అసిస్టెంట్ ద్వారా నిర్వాహకులను కోరారని కూడా త్రిష ఆరోపించారు.
"అది తప్పు కాదు.. పొరపాటు మాత్రమే"
తన వీడియో స్టేట్మెంట్లో పార్థిబన్ మాట్లాడుతూ, తెలిసి చేసేది తప్పు, తెలియక జరిగేది పొరపాటు అని విజయ్తో త్రిష పెళ్లి వేడుకకు వెళ్లడాన్ని ఇన్డైరెక్ట్గా విమర్శించారు. "నేను ఎవరినీ కించపరచాలని ఆ మాటలు అనలేదు. విజయ్, అజిత్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా స్క్రీన్పై త్రిష ఫోటో కనిపించింది. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆమె ఫోటో వేయమని నేను అడిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం" అని పార్థిబన్ స్పష్టం చేశారు.
కుందవై పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "కేవలం ప్రాస (Rhyming) కోసం మాత్రమే ఆ పదం వాడాను. ఏవైనా సమస్యలు రాకుండా ఉండాలంటే ఆమె ఇంట్లోనే ఉండాలని సరదాగా అన్నానే తప్ప, మహిళలు ఇంట్లోనే ఉండాలని నా ఉద్దేశం కాదు" అని పార్థిబన్ వివరించారు.
{{/usCountry}}కుందవై పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "కేవలం ప్రాస (Rhyming) కోసం మాత్రమే ఆ పదం వాడాను. ఏవైనా సమస్యలు రాకుండా ఉండాలంటే ఆమె ఇంట్లోనే ఉండాలని సరదాగా అన్నానే తప్ప, మహిళలు ఇంట్లోనే ఉండాలని నా ఉద్దేశం కాదు" అని పార్థిబన్ వివరించారు.
{{/usCountry}}అలాగే, త్రిష పోస్టుపై పార్థిబన్ అసహనం వ్యక్తం చేశారు. స్టేజీపై తాను ఆ మాట అనాల్సింది కాదని, తన తప్పును ఒప్పుకుంటూ త్రిష చేసిన పోస్టుు థర్డ్ రేటెడ్ ట్వీట్ అంటూ పార్థిబన్ అభివర్ణించారు. ఇతర సందర్భాల్లో ఎదుర్కొన్న అసభ్యకర విమర్శలపై త్రిష స్పందించి ఉంటే.. తనపై చేసిన విమర్శలను కూడా స్వాగతించేవాడినని పార్థిబన్ చెప్పారు.
క్షమాపణలు చెప్పిన దర్శకుడు
తాను వేదిక దిగి రాగానే సీనియర్ జర్నలిస్ట్ రంగరాజ్ పాండే ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని సూచించారని పార్తిబన్ తెలిపారు. వెంటనే ఆ క్లిప్పింగ్ను తొలగించాలని నిర్వాహకులను కోరినప్పటికీ, అప్పటికే అది సోషల్ మీడియాలోకి వెళ్లిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
"జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నా మాటలను తప్పుగా వక్రీకరించడం బాధ కలిగించింది. ఒకవేళ నేను పొరపాటు చేస్తే దానిని అంగీకరించడానికి నాకు ఎప్పుడూ మొహమాటం ఉండదు" అని పార్థిబన్ తన స్టేట్మెంట్ను ముగించారు.
త్రిష రియాక్షన్ ఎలా ఉంటుందో?
ఓవైపు త్రిషకు సారీ చెబుతూనే మరోవైపు తాను చేసిన పనిపై సెటైర్లు వేశారు పార్థిబన్. మరి ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ త్రిష ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.