ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందర్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి తయారుచేసిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించినట్టుగా పిటిషన్లో పేర్కొన్నాడు. ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన సినిమాలోత తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని తెలిపాడు.
అకీరా ఏఐ సినిమా భారీగా వ్యూస్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన పూర్తి నిడివి గల చిత్రాన్ని అనధికారికంగా సృష్టించడం ద్వారా తన వ్యక్తిత్వం, ప్రచారం, గోప్యతా హక్కులను పెద్ద ఎత్తున ఉల్లంఘించారని ఆరోపిస్తూ అకీరా నందన్ పిటిషన్లో కోర్టుకు వివరించాడు. ఏఐ లవ్ స్టోరీ అనే ఏఐ రూపొందించిన సినిమాను యూట్యూబ్లో బహుళ వెర్షన్లలో అప్లోడ్ చేశారని తెలిపాడు. జనవరి 22, 2026 నాటికి తెలుగు భాషా వెర్షన్ 1,109,255 వీక్షణలను, ఆంగ్ల భాషా వెర్షన్ 24,354 వ్యూస్ వచ్చాయని ఈ విషయం కోర్టు దృష్టికి వెళ్లింది.
అకీరాపై ఫేక్ ప్రొఫైల్స్
అయితే ఏఐ సినిమాతోపాటుగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లో తన పేరుపై ఫేక్ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని అకీరా కోర్టుకు పిటిషన్లో వెల్లడించాడు. ఈ ఖాతాలలో కొన్ని తన పేరుతో విరాళాలు కోరుతున్నాయని, దీనివల్ల మోసం, ఆర్థిక దుర్వినియోగం జరుగుతుందనే ఆందోళనలు లేవనెత్తుతున్నాయని అకీరా ఆరోపించాడు.
వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హైకోర్టును అకీరా అభ్యర్థించాడు. అతడి పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
దోపిడీ చేయడమేనన్న కోర్టు
ఏఐ సాయంతో తీసిన సినిమాపై నిషేధం విధించింది హైకోర్టు. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని కోర్టు కామెంట్స్ చేసింది. పిటిషనర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా.. కంటెంట్ను రూపొందిస్తే.. ప్రైవసీకి భంగం కలుగుతుందని, ఇది గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని చెప్పింది.
అకీరాకు ఫ్యాన్స్
{{/usCountry}}ఏఐ సాయంతో తీసిన సినిమాపై నిషేధం విధించింది హైకోర్టు. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని కోర్టు కామెంట్స్ చేసింది. పిటిషనర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా.. కంటెంట్ను రూపొందిస్తే.. ప్రైవసీకి భంగం కలుగుతుందని, ఇది గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని చెప్పింది.
అకీరాకు ఫ్యాన్స్
{{/usCountry}}'కేసులోని వాస్తవాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా చూస్తే అకీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినోద పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి అని తెలుస్తోంది. వాది చిన్నవాడు అయినప్పటికీ, అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రజలలో, వినోద పరిశ్రమలో అతని ప్రజాదరణను సూచిస్తుంది.' అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఏఐ సినిమాపై నిషేధం
దీనికి సంబంధించి కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏఐతో రూపొందించిన సినిమాపై నిషేధం విధించాలని, సోషల్ మీడియా ఖాతాలు తొలగించాలని, ఐపీ వివరాలను బహిర్గతం చేయాలని తెలిపింది. ఈ కేసు విచారణ జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఎదుట జరిగింది. అకీరా తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ దిల్లీ హైకోర్టులు పిటిషన్ వేశారు. గూగుల్ తరఫున ఆదిత్యా గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.