బాలీవుడ్లో మగ అహంకారాన్ని సాటిస్ఫై చేయడానికి నేను అలా నటిస్తాను.. పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కామెంట్స్
రామ్ చరణ్ పెద్ది సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్లో మగ అహంకారంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హిందీ టాక్ షో టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్లో అతిథిగా హాజరైన జాన్వీ కపూర్ పురుష అహంకారాన్ని సాటిస్ఫై చేసేందుకు తాను ఎలా నటిస్తుందో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ గ్లామర్ డాల్, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇటీవలే పరమ్ సుందరి సినిమాతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్ తెలుగులో రామ్ చరణ్ పెద్ది సినిమాలో హీరోయిన్గా చేస్తోంది.
బాలీవుడ్లో మగ అహంకారాన్ని సాటిస్ఫై చేయడానికి నేను అలా నటిస్తాను.. పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కామెంట్స్
పురుష అహంకారాన్ని
అయితే, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పురుష అహంకారాన్ని ఒక మహిళగా ఎలా ఎదుర్కోవాలో దాపరికం లేకుండా తాజాగా జాన్వీ కపూర్ చెప్పింది. దీంతో జాన్వీ కపూర్ కామెంట్స్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటిఫుల్ సీనియర్ హీరోయిన్స్ కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్గా చేస్తున్న హిందీ టాక్ షో టూ మచ్.
జాన్వీ కపూర్ కామెంట్స్
ఈ టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ టాక్ షోలో అతిథిగా హాజరైన జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది. బాలీవుడ్లో మేల్ ఇగోను తను ఎలా సాటిస్ఫై చేస్తుందో జాన్వీ కపూర్ ఈ టాక్ షోలో తెలిపింది.
ఏం తెలియనట్లు
"ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఉన్న పని వాతావరణంలో నేను ఉన్నానని అర్థం చేసుకున్నాను. కానీ, ఇది పురుష అహంకారం, మగ అహం వంటివైపు దారి తీస్తున్నాయని నేను భావించాను. నాకు ఒక అభిప్రాయం ఉంటే నేను ఎలాంటి బెరుకు లేకుండా చెప్పగలిగే ప్లేసులో, పరిస్థితిలో ఉండాలి. కానీ, నేను అలాంటి పరిస్థితుల్లో ఏం తెలియనట్లు (డంబ్) నటించే ప్లేసులో ఉన్నాను" అని జాన్వీ కపూర్ చెప్పింది.
అభిప్రాయాలు రుద్దకుండా
"మీ పోరాటాన్ని మీరే ఎంచుకోవాలి. ఎవరిపై తప్పుడు అభిప్రాయాలు రుద్దకుండా మీ పాయింట్ను ఎలా బయటపెట్టాలో నేర్పరితనం ఉండాలి" అని జాన్వీ కపూర్ చెప్పకొచ్చింది. దాంతో మధ్యలో జోక్యం చేసుకున్న ట్వింకిల్ ఖన్నా 1990స్లో బాలీవుడ్లో హీరోయిన్గా తాను అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పింది.
యుక్తిగా ఉండాల్సిన అవసరాన్ని
అలాంటి పరిస్థితిని జాన్వీ కపూర్ అనుభవిస్తుంటే సానుభూతి వ్యక్తం చేసింది ట్వింకిల్ ఖన్నా. "నేను చిన్నతనంలో అదే సమస్యను ఎదుర్కొన్నాను. కానీ, నేను యుక్తిగా ఉండాల్సిన అవసరాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు" అని ట్వింకిల్ ఖన్నా పేర్కొంది.
కాగా మోస్ట్ బ్యూటిపుల్ ట్వింకిల్ ఖన్నా స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అని తెలిసిందే. అలాగే, టూ మచ్ టాక్ షో మరో హోస్ట్ అయిన సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా హిందీ అగ్ర హీరో అజయ్ దేవగన్ సతీమణి. ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కలిసి ఓ టాక్ షోని హోస్ట్ చేయడం ఇదే తొలిసారి.