రాజా సాబ్ మేనియా.. ప్రభాస్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు.. అక్కడ రూ.2 కోట్లు దాటేసిన కలెక్షన్లు

రాజాసాబ్ మేనియా ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమా రిలీజ్ కు ఇంకా వారానికి పైగా సమయం ఉంది. ఇప్పుడే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ అదరగొడుతున్నాయి. నార్త్ అమెరికాలో వసూళ్లు రూ.2 కోట్లు దాటాయి. 

Published on: Dec 30, 2025, 10:45:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇప్పుడు ఎక్కడ చూసినా రాజాసాబ్ మేనియా కనిపిస్తోంది. ప్రి రిలీజ్ ఈవెంట్, రాజా సాబ్ 2.0 ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. జనవరి 9, 2026న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

రాజా సాబ్ పోస్టర్ లో ప్రభాస్
రాజా సాబ్ పోస్టర్ లో ప్రభాస్

రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'రాజాసాబ్' 2026లో తొలి బిగ్ టికెట్ రిలీజ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం అమెరికాతో సహా ఎంపిక చేసిన విదేశీ ప్రాంతాల్లో ప్రీ-సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించింది. ఈ చిత్రం విదేశాలలో అద్భుతమైన ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

అక్కడ రూ.2 కోట్లు

మేకర్స్ రీసెంట్ గా రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయమే ఉండగా.. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ $ 200k దాటింది. అంటే రూ.2 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో చేరాయి.

‘‘రెబెల్ సాబ్ మానియా ఇప్పుడే ప్రారంభమవుతోంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ $ 200K. భారతదేశ అతిపెద్ద హర్రర్ ఫాంటసీని లెక్క కడుతోంది. జనవరి 8న ప్రత్యాంగీరా యుఎస్, పీపుల్ సినిమాస్ సంయుక్తంగా ఓవర్సీస్ లో రాజాసాబ్ ప్రీమియర్స్ ప్రసారం చేస్తాయి’’ అని పోస్టులో పేర్కొన్నారు.

అదిరే కలెక్షన్లు

ట్రేడ్ ట్రాకర్స్ ప్రకారం, ది రాజాసాబ్ డిసెంబర్ 29 ఉదయం నాటికి ప్రీ-సేల్స్ ద్వారా యుఎస్ లో రూ .2 కోట్ల గ్రాస్ ను ఆర్జించింది. ఇంత తొందరగా ఈ ప్రారంభ వేగం చూస్తుంటే ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి కలెక్షన్లు అదిరిపోతాయని అనిపిస్తోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటించారు. దీనికి మారుతి డైరెక్టర్.

విజయ్ తో పోటీ

సంక్రాంతి 2026 రేసులో తమిళ స్టార్ దళపతి విజయ్ తో పోటీపడుతున్నాడు ప్రభాస్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ చివరి సారిగా నటిస్తున్న సినిమా ‘జన నాయకుడు’. ఇది కూడా రాజా సాబ్ రిలీజ్ అవుతున్న జనవరి 9నే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి విజయ్, ప్రభాస్ లో ఆ రోజు థియేటర్లలో ఎవరు విజయం సాధిస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రభాస్ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ కావడం కలిసొచ్చేదే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More