విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రేపు (ఫిబ్రవరి 26) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గురువారం ఉదయ్పూర్లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతుంది. ఈ నేపథ్యంలో కాబోయే దంపతులు రష్మిక, విజయ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఓ స్పెషల్ లెటర్ ద్వారా పీఎం తన ఆశీర్వాదాన్ని పంపించారు.
ప్రధాని శుభాకాంక్షలు

విరోష్ వెడ్డింగ్ సందర్భంగా మందన్న, దేవరకొండ కుటుంబాలకు, కాబోయే కొత్త దంపతులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ స్పెషల్ లెటర్ ను పంపించారు. ఈ లేఖను విజయ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. "ఇది ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది" అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.
కొత్త అధ్యాయం
"2026 ఫిబ్రవరి 26న జరగనున్న విజయ్, రష్మికల వివాహానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఎంతో సంతోషకరమైన ఈ శుభ సందర్భంగా దేవరకొండ, మందన్న కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు. అలాగే శుభాకాంక్షలు. ఇది విజయ్, రష్మిక జీవితాల్లో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది’’ అని లెటర్ లో పీఎం మోదీ తెలిపారు.
దేవుడి స్క్రిప్ట్
‘‘ 'సఖ సప్తపద భవ' స్ఫూర్తితో.. ఏడు అడుగులు కలిసి నడిచిన తర్వాత దంపతులు జీవితకాల స్నేహితులుగా మారతారు. విజయ్, రష్మికకు సినిమా స్క్రిప్ట్ లు కొత్తేం కాదు. కానీ ఇది వాళ్ల జీవితాల్లో ప్రేమ, ఆప్యాయత నిండేలా దేవుడు రాసిన స్క్రిప్ట్. సిల్వర్ స్క్రీన్ పై వీళ్లు క్రియేట్ చేసిన మ్యాజిక్ ను ఈ దేవుడి స్క్రిప్ట్ కచ్చితంగా దాటేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
నిజమైన పార్ట్ నర్స్ గా
‘‘పంచుకున్న కలలు, వాటిని నెరవేర్చుకునే లక్ష్యంతో వీళ్ల రాబోయే రోజులు, నెలలు, సంవత్సరాలు ఉండాలి. ఆలోచన, ప్రేమతో వాళ్లు బాధ్యతలను పంచుకోవాలి. ఒకరికొకరు పూర్తిగా తెలుసుకోవాలి. ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవాలి. నిజమైన పార్ట్ నర్స్ లా లైఫ్ జర్నీని కొనసాగించాలి’’ అని లెటర్ లో పీఎం మోదీ తెలిపారు.
{{/usCountry}}‘‘పంచుకున్న కలలు, వాటిని నెరవేర్చుకునే లక్ష్యంతో వీళ్ల రాబోయే రోజులు, నెలలు, సంవత్సరాలు ఉండాలి. ఆలోచన, ప్రేమతో వాళ్లు బాధ్యతలను పంచుకోవాలి. ఒకరికొకరు పూర్తిగా తెలుసుకోవాలి. ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవాలి. నిజమైన పార్ట్ నర్స్ లా లైఫ్ జర్నీని కొనసాగించాలి’’ అని లెటర్ లో పీఎం మోదీ తెలిపారు.
{{/usCountry}}‘‘ఈ గొప్ప సందర్భంలో ఆ దంపతులకు, కుటుంబాలకు నా ఆశీర్వాదాలు, అభినందనలు’’ అని మోదీ లెటర్ లో పేర్కొన్నారు.
విరోష్ వెడ్డింగ్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరుగుతుంది. ఇప్పటికే మెహందీ, హల్దీ, సంగీత్ లాంటి ప్రి వెడ్డింగ్ ఈవెంట్లు స్టార్ట్ చేశారు. మార్చి 4న హైదరాబాద్ లో రష్మిక, విజయ్ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.