వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫైర్ అయింది. తన భర్త నిక్ జోనస్ నుంచి ఆమె విడిపోతుందని, విడాకులు తీసుకుంటుందనే పుకార్లపై సీరియస్ గా రియాక్టయింది. ఇవన్నీ కుట్రతో కూడిన వదంతులు అని ఆమె స్పష్టం చేసింది. తమ పెళ్లి జీవితం బ్లాస్ట్ కావాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రియాంక చోప్రా కామెంట్లు

విడాకుల పుకార్లపై ప్రియాంక చోప్రా స్పందించింది. 'వెరైటీ'తో ప్రియాంక మాట్లాడుతూ.. "మా పెళ్లి బంధం బ్లాస్ట్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏదేమైనా అది వాళ్ల భ్రమ. మా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ప్రజలకు ఎందుకు ఇంత ఇబ్బంది కలిగిస్తుందో అర్థం కావడం లేదు’’ అని తెలిపింది.
వేర్వేరు దేశాలు
"మేము ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేశా. మా విషయంలో జనాలకు అంత ఇబ్బంది కలిగించింది ఏంటో నాకు అర్థం కావడం లేదు. బహుశా వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు, వయస్సు తేడా అయి ఉండవచ్చు. నేను, నిక్ కలిసి బయటి విషయాల కంటే కూడా మమ్మల్ని మేం పట్టించుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం’’ అని ప్రియాంక చోప్రా తెలిపింది.
అతనిలో నిజాయతీ
‘‘మా పరిచయం తర్వాత ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు అది నిజమో కాదో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో ఉండిపోయా. అయితే నిక్ లో నిజాయతీ ఉంది. అతను ఎప్పుడూ నిజాయతీగానే ఉంటాడు. అతను చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాడు. అతని తల్లిదండ్రులు చాలా అద్భుతమైన, స్థిరమైన, నిష్కల్మషమైన వ్యక్తులు. నిక్ కూడా వాళ్ల పేరెంట్స్ లాగే ఉన్నాడు’’ అని ప్రియాంక చోప్రా చెప్పింది.
ప్రియాంక, నిక్ పెళ్లి గురించి
2018లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి రాజస్థాన్ లో గ్రాండ్ గా జరిగింది. 2022లో వీళ్లకు పాప మాల్తీ పుట్టింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి మూవీ చేస్తోంది. ఇందులో మహేష్ బాబు హీరో. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది.
{{/usCountry}}2018లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి రాజస్థాన్ లో గ్రాండ్ గా జరిగింది. 2022లో వీళ్లకు పాప మాల్తీ పుట్టింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి మూవీ చేస్తోంది. ఇందులో మహేష్ బాబు హీరో. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది.
{{/usCountry}}ప్రియాంక చోప్రా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఆమె వెబ్ సిరీస్ సిటాడెల్ రెండో సీజన్ కూడా లైన్ లో ఉంది. ఇక ప్రియాంక చోప్రా సముద్రపు దొంగగా నటించిన ది బ్లఫ్ ఓటీటీలోకి రాబోతుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక.. ఇప్పుడు వారణాసితో మళ్లీ ఇండియన్ మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.